‘వకీల్ సాబ్’ ఉగాది సర్‌ప్రైజ్ చూశారా?

  • IndiaGlitz, [Monday,April 12 2021]

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఇక పవన్ ఫ్యాన్స్‌కైతే ఈ చిత్రం తెగ నచ్చేసింది. మూడేళ్ల తర్వాత అద్భుతమైన కమ్ బ్యాక్ అంటూ పవన్ అభిమానులు సంబరపడుతున్నారు. బాలీవుడ్‌లో మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం మూల కథ మారకుండా పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ సినీ కెరీర్‌కు కాకుండా పొలిటికల్ కెరీర్‌కు కూడా ఈ సినిమా బాగా దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

అయితే ఈ చిత్ర యూనిట్ ఉగాది కానుకగా.. ఈ సినిమాలో పవన్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ సంభాషణల్ని ప్రోమోల రూపంలో విడుదల చేసింది. మూడు ప్రోమోల ద్వారా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న డైలాగ్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మూడు సన్నివేశాలు కోర్టుకు సంబంధించినవే కావడం విశేషం. మొదటి ప్రోమోలో.. ప్రకాష్ రాజ్, పవన్‌కు మధ్య జరిగిన సంభాషణ, రెండో ప్రోమోలో పోలీసాఫీసర్‌ను కోర్టు బోనులో నిలబెట్టి పవన్ ప్రశ్నిస్తున్నది, మూడో ప్రోమోలో.. పవన్ కోర్టులో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్. ఈ మూడు ప్రోమోలు గూస్ బంప్స్ తెప్పించేవిగానే ఉన్నాయి.

‘నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా. కానీ, దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే’అంటూ ప్రకాష్‌రాజ్‌తో పవన్ చెప్పిన డైలాగ్.. ‘ఆడదంటే వాడి బాత్‌రూమ్‌లో గోడమీద ఉండే బొమ్మ కాదు.. వాడ్ని కనిపెంచిన అమ్మ కూడా’ అంటూ పవన్‌ సోలోగా చెప్పిన డైలాగ్.. భావోద్వేగానికి గురి చేస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌, శ్రుతి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పించారు.

More News

ఆద్యంతం ఉత్కంఠగా ‘ఖిలాడి’ టీజర్

‘క్రాక్’ సినిమా మంచి సక్సెస్ సాధించిన అనంతరం ఫుల్ జోష్‌తో మాస్ మహరాజన్ రవితేజ చేస్తున్న చిత్రం ‘ఖిలాడి’.

తిరుపతి ఉపఎన్నిక వేళ జనసేన పార్టీకి షాక్..

తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఒకవైపు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లో ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు.

విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కోవిడ్‌ సెకండ్ వేవ్ తెలంగాణలో విజృంభిస్తోంది. మూడు వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది.

ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’.. ముహూర్తం ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీ గత శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది.

‘జాతిరత్నాలు’ నిర్మాతకు ఎంత లాభం తెచ్చిపెట్టిందంటే..

లాక్‌డౌన్ తర్వాత మరీ ముఖ్యంగా చెప్పాలంటే మార్చి నెలలో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించిన చిత్రం ‘జాతిరత్నాలు’.