'వ‌కీల్‌సాబ్‌' వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం

  • IndiaGlitz, [Monday,March 30 2020]

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. బాలీవుడ్ మూవీ పింక్‌కు ఇది రీమేక్‌. దిల్‌రాజు, బోనీ క‌పూర్ నిర్మాత‌లుగా శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగింది. ఈ గ్యాప్‌ను వ‌కీల్‌సాబ్ వేస్ట్ చేయాల‌నుకోవ‌డం లేద‌ట‌. అందుకోస‌మ‌ని వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్లే.. ‘వ‌కీల్‌సాబ్‌’ కోసం ప‌వ‌న్ డేట్స కేటాయించాడు. అనుకున్న‌ట్లే షూటింగ్ జ‌రిగింది. అయితే జర‌గాల్సిన షూటింగ్ ఆగింది. మ‌ళ్లీ లాక్‌డౌన్ ఎత్తివేయ‌గానే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈలోపు త‌న పార్ట్‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను ప‌వ‌న్ ఇంటి నుండి చెప్పేస్తున్నాడ‌ట‌. ఇది పూర్తి కాగానే ప‌వ‌న్ షూటింగ్ త్వ‌ర‌గా పూర్తి చేసేసి త‌దుప‌రి సినిమాకు షిఫ్ట్ అయిపోతాడు ఎందుకంటే అక్క‌డ డైరెక్ట‌ర్ క్రిష్ వెయిటింగ్‌లో ఉన్నాడు. దీన్ని కూడా త్వ‌ర‌త్వ‌ర‌గానే పూర్తి చేయాల్సి ఉంది. దీన్ని పూర్తి చేసిన త‌ర్వాత త‌దుప‌రి క‌మిట్‌మెంట్స్‌పై ఫోక్స్ చేయాల్సి ఉంది.

అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మే 15న ‘వ‌కీల్‌సాబ్‌’ను రిలీజ్ చేయాల‌నేది నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీ క‌పూర్ ఆలోచ‌న‌గా క‌న‌ప‌డుతుంది. మ‌రి ‘వ‌కీల్‌సాబ్‌’ అనుకున్న‌ట్లు వ‌స్తాడో రాడో తెలియాలంటే వేచి చూడ‌క త‌ప్ప‌దు.