వంశీ వర్సెస్ లోకేష్.. ఆ వెబ్‌సైట్లతో నాకేంటి సంబంధం!?

  • IndiaGlitz, [Friday,November 15 2019]

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత మొదలుకుని నారా లోకేష్ ఇలా అందరి నేతలపై వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వంశీ వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో పార్టీ నుంచి వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో వంశీపై టీడీపీ పెద్దలు, ద్వితియ శ్రేణి నేతలు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

లోకేశ్‌కు కౌంటర్!

వంశీ తనపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వంశీ.. లోకేశ్ కేమీ పనీపాటా లేదు కనుక సోషల్ వెబ్ సైట్స్ మెయిన్టెన్ చేస్తున్నాడని, వీటి ద్వారా రాజ్యాధికారం వస్తుందని, జనాలను భ్రమపెట్టొచ్చని, ప్రభావితం చేయొచ్చని అనుకుంటున్నాడని, ‘ఇది తప్పు’ అని హితవు పలికారు. పిచ్చి పదవుల కోసం లోకేశ్ వెనుక ఎవరైనా తిరుగుతారేమోకానీ, తన లాంటి ఎవరూ తిరగరని అన్నారు.

లోకేశ్ రియాక్షన్..

‘పార్టీలోకి చాలా మంది నాయకులు వస్తారు.. పోతారు.. అలాంటి వారి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉంది. నాయకులు వెళ్లినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెంటే ఉంటారు. ఎన్నికల ముందు జగన్‌ని తిట్టిపోసిన వ్యక్తి ఇప్పుడు ఆయన పంచకే చేరారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని నాకు ఆపాదించడం తగదు. ఎవరో వార్తలు రాస్తే నేనెలా బాధ్యుడిని అవుతాను?. ఆ వెబ్‌సైట్లతో నాకెలాంటి సంబంధం లేదు. ఎవరికి భూమి కేసులున్నాయో వాళ్లే పార్టీ వీడి వెళ్తున్నారు. ఐదు నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్స్ అయిపోయింది. ఇకపై జగన్ గెలిచే అవకాశమే లేదు’ అని ట్విట్టర్‌లో లోకేష్ జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వల్లభనేని, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. మొత్తానికి చూస్తే నిన్న రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ వంశీ.. ఇవాళ్టి నుంచి వంశీ వర్సెస్ లోకేశ్‌గా పరిస్థితులు మారే అవకాశాలున్నాయ్. అంటే మాటల యుద్ధం తప్పేలా లేదు.

More News

టీడీపీ నుంచి వంశీ సస్పెండ్.. బాబుకు అంత సీన్ లేదు!

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత మొదలుకుని

వశిష్ట నారాయణ్ సింగ్ అకాల మృతి బాధాకరం : హృతిక్

ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ఠ నారాయన్ సింగ్(74) తుదిశ్వాస విడిచారు. నలభై ఏళ్లుగా మనోవైకల్యం (డిప్రెషన్స్‌)తో భాధపడుతున్న ఆయన నవంబర్-14న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

పూరి జగన్నాథ్ లాంచ్ చేసిన 'అప్పుడు-ఇప్పుడు' టీజర్

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`.

'ఒరేయ్ ...బుజ్జిగా'లో కీల‌క పాత్ర‌లో హెబ్బాప‌టేల్‌

`ఏమైంది ఈ వేళ‌`, `అధినేత‌`, `బెంగాల్ టైగ‌ర్‌`, `పంతం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌గా కార్తి `ఖైదీ` చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు

విశాల్‌ కెరీర్ లోనే 'యాక్షన్' హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది - నిర్మాత శ్రీనివాస్‌ ఆడెపు

'హుషారు', 'కబాలి', 'ఇస్మార్ట్‌ శంకర్‌', 'గద్దలకొండ గణేష్‌', 'రాజుగారిగది3 ' వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రస్తుతం 'యాక్షన్' మూవీతో నిర్మాతగా మారారు శ్రీనివాస్‌ ఆడెపు.