డాలస్ లో చెన్నుబోయిన వంశీకృష్ణకు ఘన సన్మానం


Send us your feedback to audioarticles@vaarta.com


డాలస్ జనసైన్యం సభ్యుల ఆధ్వర్యంలో విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. డాలస్ లోని ది మెరిడియన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుదారులు, జనసేన వీరమహిళలు, జనసైనికులు, టీడీపీ-బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, ప్రధాని మోదీ సహకారంతో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చలు జరిగాయి. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు వంశీ.
గడిచిన ఐదేళ్లలో జరిగిన అరాచకం నుంచి ప్రజలు విముక్తి పొంది, స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు వంశీకృష్ణ. విశాఖపట్నం ప్రాముఖ్యతను, అక్కడి పారిశ్రామిక వృద్ధిని గుర్తించి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీ రాజ్ గ్రామీణ విభాగంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఆయన హైలైట్ చేశారు.
అదే రోజు, ఎమ్మెల్యే వంశీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం స్నేహపూరిత వాతావరణంలో జరిగింది. తన పర్యటనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు వంశీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments