'వాసుకి' ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

  • IndiaGlitz, [Friday,May 12 2017]

మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పుదియ నియ‌మం' తెలుగులో 'వాసుకి'గా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. 'వాసుకి' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ నేడు హైద‌రాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ‌బాబు, వ‌రుణ్‌తేజ్ స‌హా చిత్ర‌యూనిట్ పాల్గొంది.
మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ మాట్లాడుతూ -''మ‌ల‌యాళంలో ఇప్ప‌టికే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయి విజ‌యం అందుకోవ‌డ‌మే గాకుండా.. న‌య‌న్‌కి చ‌క్క‌ని పేరు తెస్తుందనే అనుకుంటున్నా. అలాగే తెలుగు వెర్ష‌న్‌ నిర్మాత‌కు చ‌క్క‌ని స‌క్సెస్ ద‌క్కాల‌ని ఆశిస్తున్నా'' అన్నారు.
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మాట్లాడుతూ-''పొరుగు భాష‌లో పెద్ద హిట్టయిన ఈ చిత్రం తెలుగు నిర్మాత‌ల‌కు అంతే మంచి ఫ‌లితాన్ని ఇవ్వాల‌ని ఆశిస్తున్నా. నిర్మాత మోహ‌న్‌ నుంచి మ‌రిన్ని మంచి చిత్రాలు రావాల‌ని ఆకాంక్షిస్తున్నా. వాసుకి పెద్ద హిట్ట‌వ్వాలి.. డ‌బ్బు, పేరు తేవాలి'' అన్నారు.
నిర్మాత మోహ‌న్ మాట్లాడుతూ-''మా సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని మెగా ప్రిన్స్‌ వ‌రుణ్‌తేజ్ గారు, నాగ‌బాబు గారు లాంచ్ చేయ‌డం చాలా సంతోషాన్నిచ్చింది. వారికి ధ‌న్య‌వాదాలు. ఆ ఇద్ద‌రి చేతుల‌మీదుగా ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేయ‌డ‌మే విజ‌యానికి తొలి మెట్టుగా భావిస్తున్నాం. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. త్వ‌ర‌లోనే రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

More News

'ఇది నా లవ్ స్టోరి' కి 10లక్షల వ్యూస్

టాలీవుడ్ లో ఉవ్వెత్తిన ఎగసిపడిన కెరటం-తరుణ్.'నువ్వే కావాలి'

రజనీకాంత్ ను దాటేసిన అజిత్...

రజనీకాంత్ తలైవర్ అయితే..అజిత్ ను అందరూ ముద్దుగా తల అని పిలుచుకుంటూ ఉంటారు.

సావిత్రితో విజయ్ దేవరకొండ..

తెలుగు,తమిళ ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది.

నాగార్జున మల్టీస్టారర్..

కింగ్ నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గది2' చిత్రంతో బిజీగా ఉన్నాడు.

అలా అనుకుంటే టూ మచ్ అవుతుంది - శర్వానంద్

'రన్ రాజా రన్','మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు','ఎక్స్ ప్రెస్ రాజా','శతమానంభవతి'వంటి విజయాలను బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్