రామ్ చరణ్ స్థానంలో వరుణ్...

  • IndiaGlitz, [Thursday,July 06 2017]

త‌మిళంలో జ‌యం ర‌వి హీరోగా తెరకెక్కిన 'తని ఒరువ‌న్‌' సినిమాను తెలుగులో 'ధృవ' అనే పేరుతో రాంచ‌ర‌ణ్ హీరోగా రూపొందించారు. రెండు భాష‌ల్లోనూ సినిమా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత‌ల క‌న్ను ఈ సినిమాపై ప‌డింది. బాలీవుడ్ వెర్ష‌న్‌ను ష‌బీర్ ఖాన్ తెర‌కెక్కిస్తాడ‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ స్థానంలో వ‌రుణ్ ధావ‌న్ న‌టిస్తుంటే, ఇంటెలిజెంట్ క్రిమిన‌ల్ పాత్ర‌లో అర్జున్ క‌పూర్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం ష‌బీర్ ద‌ర్శ‌క‌త్వంలో 'మున్నా మైఖేల్‌' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాఇ పూర్తి కాగానే రీమేక్ సినిమాకోసం రంగం సిద్ధ‌మ‌వుతుంది. ఐపిఎస్ ఆఫీస‌ర్‌కు, ఇంటిలిజెంట్‌కు మ‌ధ్య న‌డిచే తెలివైన గేమ్ ప్లాన్ ఇది. తెలుగు, త‌మిళంలో అర‌వింద్ స్వామి విల‌న్‌గా న‌టించి మెప్పించాడు. ఇప్పుడు అర‌వింద్ స్వామి స్థానంలో అర్జున్ క‌పూర్ న‌టించ‌డ‌మంటే క‌త్తిమీద సామే అనాలి. మ‌రి అర్జున్ ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే...

More News

చైనాలో కూడా ఓకేసారి....

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సైంటిఫికల్ విజువల్ వండర్ '2.0'.

దాసరి బయోపిక్...

టాలీవుడ్ లో దర్శకులకు ఓ గుర్తింపు తెచ్చిన వారిలో దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ఎప్పుడూ ముందుంటారు.

'నక్షత్రం' లో అలెగ్జాండర్ వంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు కృష్ణవంశీగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు - సాయిధరమ్ తేజ్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై

తేజగారితో పనిచేశాక మరెక్కడా నేర్చుకోవాల్సిన పనిలేదు - దిలీప్

దిలీప్,ఈషా,దీక్షాపంత్ ప్రధాన పాత్రథారులుగా రూపొందిన చిత్రం 'మాయామాల్'.

ఇద్దరి నిర్ణయం..ఆరుగురి జీవితాలు.... చిత్ర దర్శకుడు నందు మల్లెల

సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం,డే డ్రీమ్స్ బ్యానర్పై అనిల్ మల్లెల,మహిమ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'.