మెగాఫ్యామిలీలో వరుణ్ పెద్ద స్టార్ అవుతాడు - కళ్యాణ్

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

ముకుంద', కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం లోఫర్‌'.

ఈ కార్యక్రమంలో హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ దిశా పటాని, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌, నిర్మాత బి.ఎ.రాజు, సునీల్‌ కశ్యప్‌, అశోక్‌కుమార్‌, అభిషేక్‌, అలూరి వెంకటేశ్వరరావు, భాస్కరభట్ల, అంకార్‌ ప్రసాద్‌, ముత్యాల రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ పూరి జగన్నాథ్‌ నిర్మాతల దర్శకుడు. ఏ విషయాన్నైనా సూటిగా, సుత్తి లేకుండా చెబుతాడు. పూరితో ఇప్పుడు వరుణ్‌తేజ్‌ చేసిన మూవీయే లోఫర్‌. వరుణ్‌ ఈ సినిమాతో మరో స్టెప్‌కు ఎదుగుతాడు. మాస్‌ హీరోగా పేరు తెచ్చుకుంటాడు. డిసెంబర్‌ 17న ప్రేక్షకులకు పండుగే'' అన్నారు.

భాస్కరభట్ల మాట్లాడుతూ పాటను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్‌. పూరిగారు నాతో మంచి పాటలు రాయించారు. అందుకు ఆయనకు, కళ్యాణ్‌గారికి థాంక్స్‌. సినిమాను సూపర్‌హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సునీల్‌కశ్యప్‌ మాట్లాడుతూ మనమంతా కూడా ఎప్పుడో ఒకసారి తుంటరి పనులు చేసి లోఫర్‌ అనే తిట్టు తినే ఉంటాం. ఇప్పుడు ఈ చిత్రంతో వరుణ్‌ అందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పాటను వింటున్నప్పుడే కాదు, సినిమా చూస్తున్నప్పుడు కూడా అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.

దిశా పటాని మాట్లాడుతూ ఆడియో ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కళ్యాణ్‌గారికి థాంక్స్‌. తొలి సినిమాలోనే పూరిలాంటి గొప్ప దర్శకుడితో పనిచేయడం ఆనందంగా ఉంది. వరుణ్‌తేజ్‌ బాగా సపోర్ట్‌ చేశాడు. సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్‌'' అన్నారు.

డాషిండ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ లోఫర్‌ ' సినిమా ట్రిపుల్‌ ప్లాటినం వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉంది. కళ్యాణ్‌గారితో నేను చేసిన రెండో సినిమా. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తర్వాత నేను చేసిన తల్లి కొడుకుల కథ. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా. సునీల్‌ కశ్యప్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దిశాపటాని తొలి సినిమా అయినా చక్కగా చేసింది. పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అవుతుంది. మెగా ఫ్యామిలీలో వరుణ్‌ మరో పెద్ద హీరో అవుతాడు. చిరంజీవిగారు మొన్న కలిసినప్పుడు వరుణ్‌గురించి పది నిమిషాు మాట్లాడారు. చిరంజీవిగారు పునాదిరాళ్ళు నుండి నటిస్తున్నారు. ఎన్నో సినిమాలు హిట్‌ కొట్టారు. కథ బాగున్నా, బాగలేకపోయినా చిరంజీవిగారు బాగా చేయలేదని ఎవరం చెప్పలేం. మళ్ళీ వరుణ్‌ అలాంటి పేరుని సంపాదించుకుంటాడు. చిరంజీవి, నాగబాబు, మెగాఫ్యామిలీ గర్వపడే స్థాయికి వరుణ్‌ చేరుకుంటాడు'' అన్నారు.

సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ మెగాఫ్యాన్స్‌ను లీడ్‌ చేసిన వ్యక్తి నాగబాబుగారు. డిసెంబర్‌ 17న అభిమానులు భుజాలపై మోసే హీరో ఎవరంటే వరుణ్‌తేజ్‌. సినిమా చూసిన అందరూ వరుణ్‌కి ఫ్యాన్‌గా మారిపోతారు. బ్రహ్మారథం పడతారు. ఓ అజానుబాహుడు హీరో అయ్యాడని అనుకుంటారు. మెగాఫ్యామిలీలో ఇప్పటి హీరోల్లో వరుణ్‌ చేసిన పెర్‌ఫార్మెన్స్‌ ఎవరూ చేయలేదు. మెగా అభిమానుకు ఒక ప్రిన్స్‌, రాకుమారుడు వచ్చాడు. పూరిగారు ఎక్స్‌ట్రార్డినరీ సినిమా తీశారు. రేపు అభిమానుందరూ ఎంజాయ్‌ చేసే సినిమా అవుతుంది'' అన్నారు.

వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ సునీల్‌ కశ్యప్‌ ఎక్స్‌ట్రార్డినరీ ఆల్బమ్‌ ఇచ్చాడు. భాస్కరభట్ల సహా గేయ రచయితలు మంచి లిరిక్స్‌ ఇచ్చారు. చరణ్‌ అన్నయ్య ఈరోజు పెద్దనాన్నగారి 150వ సినిమాను అనౌన్స్‌ చేశారు. అలాగే బాబాయ్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కోసం కూడా వెయిట్‌ చేస్తున్నాను. పెద్దనాన్న, బాబాయ్‌ని చూస్తూ పెరిగాను. వారికి నేను పెద్ద అభిమానిని. వాళ్లే నాకు ఇన్‌స్పిరేషన్‌. డెఫనెట్‌గా వారి పేరు నిలబెడతాను. పూరిజగన్‌గారికి, కళ్యాణ్‌గారికి థాంక్స్‌. బాగా చేశాను. డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను'' అన్నారు.

చిత్రయూనిట్‌ సభ్యులకు ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌లను అందజేశారు.

More News

టెన్షన్ లో రామ్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం నేను శైలజ.ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించాడు.స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పుడు త‌మ‌న్నా కూడా అత‌నితో

త‌మిళంలో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు పెట్టింది పేరు విజ‌య్ సేతుప‌తి, ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఏదో ఒక డిఫ‌రెన్స్‌ను చూపించాల‌నుకునే ఈ యంగ్ హీరోతో ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా జ‌త క‌ట్ట‌డానికి రెడీ అవుతున్నారు.

2 డేస్ లేటుగా బాహుబ‌లి 2..

ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన వెండితెర అద్భుతం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం స్రుష్టించిన విష‌యం తెలిసిందే.

త్రివిక్ర‌మ్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...ప్ర‌స్తుతం హీరో నితిన్ తో అ ఆ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

నాని సినిమాకి బాల‌య్య టైటిల్

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో నాని బాల‌య్య ఫ్యాన్ గా న‌టిస్తున్నారు.