వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం !

  • IndiaGlitz, [Monday,October 26 2020]

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్నలు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'కోతి కొమ్మచ్చి' . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన నిర్మాత దిల్ రాజు మొదటి షాట్ కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేసారు.

అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించడం జరిగింది. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాము. ఆ తర్వాత వైజాగ్ లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము. ఒకే షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము. అని తెలిపారు.

నిర్మాత ఎం ఎల్ వి సత్యానారాయణ మాట్లాడుతూ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ గారు మా బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాము. అన్నారు

త్వరలోనే షూటింగ్ లో పాల్గోనబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాం అని కథానాయకులు మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ వేగేశ్న ఆకాక్షించారు.

రిద్ది కుమార్ , మేఘ చౌధురి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనుప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

More News

దివి హౌస్ నుంచి అవుట్.. సమంత హోస్టింగ్ ఎలా ఉందంటే..

ఇవాళ అక్కినేని వారి కోడలు సమంత షోని హోస్ట్ చేసింది. ఫస్ట్ టైమ్ చేసినప్పటికీ హౌస్‌మేట్స్‌ని ఓ ఆటాడేసుకుంది.

హిమాలయాల్లో నాగ్.. ట్విట్టర్ వేదికగా చెప్పిన విక్కీ కౌశల్..

వీకెండ్ వచ్చిందంటేనే బిగ్‌బాస్ షోకి చాలా హైప్ క్రియేట్ అవుతుంది. దానికి కారణం హోస్ట్ నాగార్జున.

ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించనున్న కె.రాఘవేంద్రరావు..

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నటుడి అవతారమెత్తబోతున్నారు. కొత్త మూవీలో లీడ్ రోల్ పోషించేందుకు సర్వం సిద్ధమైంది.

సమంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. ఏడిపించబోతోంది..

బిగ్‌బాస్ సీజన్ 4. వీకెండ్‌కి సమంత రాబోతోంది. ఈ రోజు షో మొత్తం ఆమెదే. ఇవాళ ప్రోమోను స్టార్ మా యాజమాన్యం విడుదల చేసింది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్: నాకు కాబోయే వాడు షూస్‌తో సమానం..

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు దసరా సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.