వెంకటేష్ బర్త్‌డే కానుకగా.. ‘ఎఫ్ 3’ అధికారిక ప్రకటన..

  • IndiaGlitz, [Sunday,December 13 2020]

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా రూపొందిన చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. వెంకీ, వరుణ్‌లు.. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌ కౌర్‌‌తో కలిసి చేసిన కామెడీ.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. 2019లో బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. సంక్రాంతి అల్లుళ్లు వస్తున్నారంటూ విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.

అయితే విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రబృందం అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చింది. మోర్‌ ఫన్‌తో.. ఎఫ్‌2 సీక్వెల్‌గా 'ఎఫ్‌ 3'ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. మరి ఈ సీక్వెల్‌లో హీరోయిన్స్‌గా తమన్నా, మెహ్రీన్‌లే కొనసాగుతారో మరెవరినైనా తీసుకుంటారో చూడాలి. అయితే విక్టరీ వెంకటేశ్‌ పుట్టినరోజు సందర్భంగా.. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న 'ఎఫ్‌ 3' గురించి అధికారిక ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో కూడా చాలా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.

వీడియోలో ముందుగా.. ‘ఎఫ్ 2’ ట్రైలర్‌లోని కొంత భాగాన్ని తీసుకుని అనంతరం ‘ఎఫ్ 3’ కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. 'నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాం' అని వెంకీ వాయిస్‌లో... 'నవ్వుకోవడాకి మీరు కూడా థియేటర్స్‌కు వస్తారుగా' అని వరుణ్‌తేజ్‌ వాయిస్‌లో డైలాగ్స్‌తో పాటు ఎఫ్‌2 పాపులర్‌ అయిన 'అంతేగా ..అంతేగా..' అనే డైలాగ్‌తో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. లైక్స్ కూడా వేలల్లోనే వస్తున్నాయి.

More News

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. నిన్న కొత్తగా..

భారత్‌లో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా బాగానే తగ్గింది.

తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు..

తెలంగాణలో గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం 600 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రధానితో కేసీఆర్ భేటీ.. పలు కీలక విషయాలపై చర్చ..

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లిన కేసీఆర్..

కొత్త సినిమాలు విడుదల కష్టమేనట...

నిర్మాతలు, మల్టీప్లెక్స్‌ల మధ్య సయోధ్య కుదరనందున కొత్త సినిమాల విడుదల సందేహాస్పదంగానే మారిందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.