close
Choose your channels

వెంకీ డబుల్ ట్రీట్.. నారప్ప, దృశ్యం 2 డైరెక్ట్ ఓటిటి రిలీజ్

Wednesday, June 30, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వెంకీ డబుల్ ట్రీట్.. నారప్ప, దృశ్యం 2 డైరెక్ట్ ఓటిటి రిలీజ్

విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులని డబుల్ వినోదం అందించేందుకు రెడీ అవుతున్నాడు. నారప్ప, దృశ్యం 2 చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రెండు చిత్రాలకు వెంకీ సోదరుడు సురేష్ బాబే నిర్మాత కావడం విశేషం. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్నప్పటికీ టాలీవుడ్ చిత్రాల థియేట్రికల్ రిలీజ్ విషయంలో నిర్మాతలు వెనకడుగు వేస్తూనే ఉన్నారు.

ఏపీలో ఇంకా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. ప్రజల్లో కరోనా భయం ఇంకా తగ్గలేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయితే మునుపటిలా ఆదరణ ఉంటుందా అనే అనుమానం లేకపోలేదు. దీనితో నిర్మాతలు రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేరు.

వెంకీ డబుల్ ట్రీట్.. నారప్ప, దృశ్యం 2 డైరెక్ట్ ఓటిటి రిలీజ్

వెంకటేష్ లాంటి స్టార్ హీరో సినిమా, సురేష్ బాబు లాంటి బడా నిర్మాత ఉండి కూడా థియేటర్ రిలీజ్ కు ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 రెండు చిత్రాలు నేరుగా ఓటిటిలోనే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

మలయాళీ బ్లాక్ బస్టర్ దృశ్యం 2రీమేక్ లో వెంకీ, మీనా జంటగా నటించారు. ఈ చిత్ర ఓటిటి రిలీజ్ హక్కులని హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మంచి ఫ్యాన్సీ ధరకే ఓటిటి హక్కులు అమ్ముడయ్యాయట. అదే విధంగా అసురన్ రీమేక్ నారప్ప కూడా నేరుగా ఓటిటిలోనే విడుదల కానుంది. ఈ చిత్ర హక్కులని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు చిత్రాలకు కలిపి నిర్మాత సురేష్ బాబు 70 కోట్ల వరకు డీల్ కుదిరినట్లు టాక్. ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు కానీ.. బహుశా జూలై లోనే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.