వెంకటేశ్ సరసన మరో హీరోయిన్

  • IndiaGlitz, [Friday,November 29 2019]

‘ఎఫ్‌2’తో తిరుగులేని విజయాన్ని అందుకున్న హీరో వెంకటేశ్‌ దాని తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ‘అసురన్‌' రీమేక్‌లో వెంకటేశ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ్‌లో ఈ సినిమా ధనుష్‌, మంజు వారియర్‌ జంటగా తెరకెక్కింది.

ఈ సినిమా తెలుగు రీమేక్‌కు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తే బావుంటుంద‌నే విష‌యాన్ని నిర్మాత‌లు ప‌రిశీలిస్తున్నార‌ట‌. ముందుగా వెంక‌టేశ్ స‌ర‌స‌న శ్రియా శ‌రన్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డింది. తాజాగా ఇప్పుడు ఆ లిస్టులో అనుష్క పేరు ప్రముఖంగా విన‌ప‌డుతుంద‌ట‌. ప్ర‌స్తుతం చర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌.

అలాగే ఈ రీమేక్‌ను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తాడ‌ని నిర్మాత డి.సురేశ్‌బాబు ఇటీవ‌ల క‌న్‌ఫ‌ర్మ్ చేశాడు. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ సంస్థల్లో సురేష్‌ బాబు, కళైపులి ఎస్‌ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు.

ప్రస్తుతం వెంకటేష్‌ ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు. వెంకటేశ్‌, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌ను కె.ఎస్‌.రవీంద్ర డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల తేదీ త్వ‌ర‌లోనే క‌న్‌ఫ‌ర్మ్ కానుంది.

More News

రాజీనామా చేసి వైసీపీలో చేరిన కారెం శివాజీ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్షపార్టీలకు చెందిన సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, మాజీలు పార్టీలు మారుతున్న సంగతి తెలిసిందే.

ప్రియాంకరెడ్డి హత్యకేసు: నటీనటుల తీవ్ర ఆగ్రహం

దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు.

ప్రియాంకరెడ్డి హత్యకేసులో కీలక ఆధారాలు దొరికాయ్: సజ్జనార్

తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ప్రియాంరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేవలం 24 గంటల్లోనే నిందితులెవరో తెలుసుకుని ఈ కేసు ఛేదించారు.

శానిటరీ వర్కర్‌ జాబ్ కోసం 7వేల మంది గ్రాడ్యుయేట్లు క్యూ...

ప్రస్తుత కాలంలో జాబ్ ఉంటే చాలు.. అది ఏం వర్క్ ఏం అనేది మాత్రం నిరుద్యోగులు చూడట్లేదు.

ప్రియాంక హత్య కేసు: రంగంలోకి దిగిన కేటీఆర్

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డిని కొందరు మానవమృగాలు అత్యాచారం చేసి ఆపై..