'మోసగాళ్లు'కు వెంకీ వాయిస్‌ ఓవర్‌

  • IndiaGlitz, [Friday,October 16 2020]

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం ‘మోస‌గాళ్లు’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో క్రాస్‌ జోనర్‌ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ జెఫ్రీ గీ చిన్‌. కొంత మేర‌కు షూటింగ్ మాత్ర‌మే చేయాల్సి ఉంది. అమెరికాలో ప్రారంభమై ఇండియాలో ముగిసిన అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ఓ టీజర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆసక్తికరమైన విషయమేమంటే, ఈ సినిమాకు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ను అందించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో విష్ణు సోదరి పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. సునీల్ శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఈయన తెలుగులో నటిస్తోన్న తొలి చిత్రమిదే. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయనున్నారు. 'ఆచారి అమెరికాయాత్ర' డిజాస్టర్‌ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న మంచు విష్ణు చేస్తున్న చిత్రమిది.

More News

ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంపు..

ఎల్‌ఆర్‌ఎస్ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం రాత్రి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

కూకట్‌పల్లిలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్..

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం, ప్రేమ ముసుగులో యువతిని బర్త్ డే పార్టీకి రప్పించి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆకట్టుకునే పిక్స్.. కదిలించే సంఘటనలు..

మెగాస్టార్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. అవినాష్‌కి మోనాల్ టిఫిన్ తినిపిస్తుంటే... అమ్మ రాజశేఖర్ సెటైర్లు చాలా ఫన్నీగా అనిపించాయి.

బార్క్ కీలక నిర్ణయం.. 12 వారాల పాటు రేటింగ్స్ నిలిపివేత..

బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసర్చ్ కౌన్సిల్(బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. వీవర్ షిప్ ఆధారంగా టెలివిజన్ ఛానెల్స్‌కు రేటింగ్ ఇచ్చే ప్రక్రియను ఏకంగా 12 వారాలపాటు

రేపే కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం..

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది.