అన్నదమ్ముల కోసం స్టోరీ రాస్తున్న ‘వెంకీ మామ’ రచయితలు!

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

‘వెంకీ మామ‌’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మామా అల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్యల కామెడీ టైమింగ్, ఎమోషన్.. సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. వారిద్దరికీ మర్చిపోలేని విజయాన్ని అందించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పని చేసిన రచయితలు... మరో క్రేజీ కాంబినేషన్ కోసం కథ సిద్ధం చేస్తున్నారట. అక్కినేని అన్నదమ్ములు చైతన్య, అఖిల్‌తో ఓ మల్టీస్టారర్‌కి ప్లాన్ చేస్తున్నారట.

‘వెంకీ మామ’ సినిమా.. రచయిత జనార్దన మహర్షి ఆలోచనల్లోంచి పుట్టుకు వచ్చింది. దాన్ని ఆయన కోన వెంకట్‌తో పంచుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు బాబితో కలిసి సినిమాగా వెంకట్ డెవలప్ చేశారు. దీనికి మరికొందరు సహకరించారని టాక్. ఇప్పుడు వీళ్లు మరో కథను చై, అఖిల్ కోసం రాస్తున్నారని టాలీవుడ్ సమచారం. ‘వెంకీ మామ’ నిర్మించిన సురేశ్ బాబు.. ఈసినిమాను కూడా ప్రొడ్యూస్ చేయనున్నారట.

ఇదిలా ఉంటే చైతన్య, అఖిల్ తమ సినిమాల షూటింగ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో చైతన్య నటిస్తుంటే.. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో అఖిల్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ కొత్త ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని టాక్.

More News

'కథ కంచికి మనం ఇంటికి' చిత్రం ప్రారంభం !!!

హరినాధ్ నేతృత్వంలో డి.సురేష్ బాబు నిర్మాతగా పిక్ న్ హుక్ సమర్పణలో స్వాతి మూవీస్ పతాకంపై అరుణ్ ఆదిత్య, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లు గా

సినీ ప్రముఖులకు మరోసారి షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

మొన్నటి వరకూ ఐటీ అధికారులు.. ఇప్పుడేమో జీఎస్టీ అధికారులు.. సినీ ప్రముఖులకు దఢ పుట్టిస్తున్నారు!.

మహేశ్‌తో అలియా.. టాలీవుడ్‌లో చర్చ మొదలు!

సెక్సీయెస్ట్ లేడీ ఆఫ్ ది ఏషియా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అలియా భట్.. ‘ట్రిపుల్ ఆర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

రాజధానిపై రైతుల ఆందోళనలో తప్పులేదు.. కచ్చితంగా కోడి పందాలుంటాయ్!

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతికి భూములిచ్చిన రైతులు ఆందోళనలు చేపడుతున్నారు.

జనవరి 1న 'రాజా నరసింహా'

''అదొక మారుమూల అటవీ ప్రాంతం. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందుతాగి అక్కడ 75 మంది చనిపోయారు.