close
Choose your channels

జగన్ పై విడదల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు

Monday, March 3, 2025 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జగన్ పై విడదల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై, ఆ పార్టీకి చెందిన నేత, మాజీ మంత్రి విడదల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లకు మాత్రమే ఆయన పార్టీ పరిమితమైంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం ఘోర వైఫల్యం.

వీటిని దృష్టిలో పెట్టుకొని విడదల రజనీ స్పందించారు. ఎన్నికల్లో జనం ఎవ్వరూ జగన్ ను మోసం చేయలేదని, ఆయనే తనకుతానుగా మోసపోయాడని ఆమె అన్నారు. రజనీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి.

ప్రజల్లో జగన్ పై ఇష్టం ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు, సొంత పార్టీ మనుషులే జగన్ ఓటమికి కారణమయ్యారనే అర్థం వచ్చేలా విడదల రజనీ వ్యాఖ్యలున్నాయి. అయితే తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ విడదల రజనీ ఓ వీడియో విడుదల చేశారు.

అందులో కొంతమంది మహిళలు, రజనీతో మాట్లాడుతున్నారు. తాము జగన్ కే ఓటేశామని, తమకు తెలిసిన చాలామంది జగన్ కే ఓటేశారని, తాము జగన్ ను మోసం చేయలేదని, ఈవీఎంలు మోసం చేశాయని ఆమె చెప్పే వీడియోను రజనీ పోస్ట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment