ఫ్యామిలీ స‌బ్జెక్ట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

  • IndiaGlitz, [Sunday,July 01 2018]

ఇప్ప‌టివ‌ర‌కు యువ‌త‌నే టార్గెట్ చేసుకున్న సినిమాల్లో.. క‌థానాయ‌కుడిగా న‌టించారు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల విజ‌యాల‌తో యువ‌త‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్‌.. అతి త్వ‌ర‌లో ఓ కుటుంబ క‌థా చిత్రంలో న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మించ‌నున్న ఈ మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

More News

'సాక్ష్యం' మ‌ళ్ళీ వాయిదా?

అల్లుడు శీనుతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌.. ఆ త‌రువాత స్పీడున్నోడు, జ‌య‌జానకి నాయ‌క చిత్రాల్లో న‌టించారు.

'పంతం' ప్రీ రిలీజ్ వేడుక‌

గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.

'సుబ్రహ్మణ్యపురం' ఫస్ట్ లుక్ విడుదల

ఇటీవల 'మళ్ళీ రావా' వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'.

ఈసారి ర‌వితేజ‌తో..

'కలుసుకోవాలని' సినిమాతో రైటర్‌గా తొలి అడుగులు వేశారు వక్కంతం వంశీ.

మరోసారి సావిత్రిగా కీర్తి సురేష్

మహానటుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం 'యన్.టి.ఆర్'. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ..