మహేశ్ బ్రాండ్ లాగేసుకున్న రౌడీ స్టార్... స్పీడ్ మామూలుగా లేదుగా..!!

  • IndiaGlitz, [Thursday,December 09 2021]

చిన్నా చితకా క్యారెక్టర్లు చేసుకునే స్థాయి నుంచి తెలుగులో టాప్ స్టార్ రేంజ్‌కు చేరుకున్నారు విజయ్ దేవరకొండ. తన కృషి, పట్టుదలతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్నారు. ‘‘లైగర్’’ ద్వారా తొలిసారిగా విజయ్ పాన్ ఇండియా మార్కెట్‌లో అడుగుపెడుతున్నారు. ఇది ఇంకా రిలీజ్ కాకముందే బాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకి ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో రౌడీ స్టార్ త్వరలో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నారని ఫిలింనగర్ టాక్. సినిమాలతో పాటు ఎండార్స్‌మెంట్లలోనూ విజయ్ దూసుకెళ్తున్నారు.

ఇప్పటికే నేషనల్ లెవెల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. తెలుగులో సూపర్‌స్టార్ మహేష్ బాబు తరువాత ఎక్కువ బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా వుంది రౌడీ స్టారే. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. మహేష్ బాబుకి చెందిన ప్రెస్టీజియస్ బ్రాండ్ విజయ్ దేవరకొండ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా మహేష్ 'థమ్స్ అప్’’ యాడ్ లో నటిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, మహేష్ బాబుపై ఈ యాడ్ ను చిత్రీకరించారు. ఇప్పటికే ఇది టీవీల్లో ప్రసారమవుతోంది. అయితే ఇప్పుడు మహేష్ బాబుకి బదులుగా విజయ్ దేవరకొండ ఈ యాడ్ లో కనిపించబోతున్నారని టాక్. తెలుగు నాట తొలిరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ లో నటించేవారు. ఆయన తరువాత మహేష్ ‘‘థమ్స్ అప్’’ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు విజయ్ చేతులోకి ఈ బ్రాండ్ వచ్చింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘‘లైగర్’’ షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. సంక్రాంతి కానుకగా లైగర్‌ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. వరుసగా పెద్ద సినిమాలు క్యూలో వుండటంతో మేకర్స్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలలను పరీక్షలకు వదిలేసి.. ఏప్రిల్‌లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాక్సిండ్ లెజెండ్ మైక్ టైసన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

More News

'కుంభస్థలాన్నే కొడదాం పదా '.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.

'బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్' ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఎవడు చెప్పిండ్రా' లాంఛ్ చేసిన దిల్ రాజు

ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్".

సోహెల్ హీరోగా ల‌క్కీ మీడియా 'బూట్ క‌ట్ బాల‌రాజు' ప్రారంభం

బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్‌, అన‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా ల‌క్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం `బూట్ క‌ట్ బాల‌రాజు`.

ల‌క్ష్య లో ఆట‌తో పాటు అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఉంటాయి - నిర్మాత‌లు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్‌మోహ‌న్

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.

`గాడ్సే` వంటి మంచి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది -  ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్‌

ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించింది. సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని అన్నారు