విజ‌య్ దేవ‌ర క్రేజీ ప్రాజెక్ట్‌..?

  • IndiaGlitz, [Thursday,December 13 2018]

విజ‌య్ దేవ‌ర‌కొండ తెలుగుతో పాటు త‌మిళంలో కూడా రాణించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఆయ‌న గ‌త చిత్రం 'నోటా' బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అయినా ప్ర‌య‌త్నాలు మాత్రం మానుకోవ‌డం లేదు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు మ‌రో త‌మిళ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై శ్రీకార్తీక్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న‌తో పాటు యోగిబాబు, రాహుల్ రామ‌కృష్ణ క‌లిసి న‌టించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో 'డియ‌ర్ కామ్రేడ్' చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజ‌య్.

More News

జనవరి 25న 'మిస్టర్ మజ్ను'

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ మజ్ను'.

డిసెంబ‌ర్ 16న ఎన్టీఆర్ ట్రైల‌ర్.. 21న ఆడియో లాంఛ్..

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ హైద‌రాబాద్ లో... ఆడియో రిలీజ్ ఈవెంట్ నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 16న ట్రైల‌ర్ లాంచ్.

96... క‌న్న‌డలో 99... మరి తెలుగులో...

త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లైన ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం '96'. విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి దిల్‌రాజు హ‌క్కుల‌ను పొందారు.

ప్లాప్ సినిమా స్టైల్లో 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ జంట‌గా క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీ 'తేజ్  ఐల‌వ్‌యు' సినిమాస్టైల్లోనే శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' సినిమా

వెబ్ సిరీస్‌లో అమ‌ల‌...

అక్కినేని మ‌నం, మ‌ల‌యాళ చిత్రం, ఓ హిందీ చిత్రం త‌ర్వాత మ‌రో సినిమాలో న‌టించ‌లేదు కానీ.. ఇప్పుడు వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు.