ముగ్గురిలో విజ‌య్‌తో న‌టించ‌బోయేది ఎవ‌రో..!

  • IndiaGlitz, [Saturday,February 06 2021]

సంక్రాంతికి 'మాస్టర్‌'తో సంద‌డి చేసిన కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ నెక్ట్స్ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. . నెల్స‌న్ న‌య‌న‌తార‌తో 'కోల‌మావు కోకిల' విడుద‌లై సూప‌ర్‌హిట్ అయ్యింది. మ‌రో వైపు శివ‌కార్తీకేయ‌న్‌తో చేసిన 'డాక్ట‌ర్' సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అంటే ఈ రెండు సినిమాల్లోనూ విడుద‌లైంది ఓ సినిమానే. బ‌డ్డింగ్ డైరెక్ట‌ర్ నెల్స‌న్‌కు విజ‌య్ అవ‌కాశం ఇవ్వ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్నారు.

అయితే హీరోయిన్‌గా ఎవ‌రు న‌టింప చేయాల‌నే దానిపై ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే తెలుగు, బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న పూజా హెగ్డే పేరు పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కాగా.. ఇప్పుడు ఈ లిస్టులో ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. వారెవ‌రో కాదు.. కియారా అద్వాని, ర‌ష్మిక మంద‌న్న‌. వీరిలో ర‌ష్మిక మంద‌న్న ఇప్ప‌టికే త‌మిళంలో కార్తితో సుల్తాన్ సినిమాలో న‌టించింది. కాగా.. కియారా అద్వానీని తీసుకుంటే ఆమె న‌టించ‌బోయే తొలి కోలీవుడ్ మూవీ ఇదే అవుతుంది.

More News

స‌మంత @ 1.5 కోట్లు

స‌మంత అక్కినేని 1.5 కోట్లు ఏంటి?  ఏదేని సినిమాకు ఆమె తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ అని అనుకుంటున్నారా?  కాదండి..

‘నాంది’ ట్రైలర్: నా జీవితం ఇప్పుడే మొదలైంది..

అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’.

రాజశేఖర్ 92ను ప్రకటించేశారు..

హీరో రాజశేఖర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న అనంతరం వరుసగా సినిమాలను ప్రకటిస్తూ వస్తున్నారు.

భార్యను చంపి అద్భుతమైన స్క్రీన్‌ప్లే నడిపాడు.. కానీ కథ అడ్డం తిరిగింది

పెళ్లయిన రెండు నెలలకే భార్యను హతమార్చి తన పైకి కేసు రాకుండా పెద్ద స్కెచ్చే వేశాడు. సినిమా రేంజ్‌లో స్క్రీన్‌ప్లే నడిపాడు.

పవన్ టైటిల్ ఫిక్స్.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లోగా వీలైనన్ని సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.