close
Choose your channels

'నమ్మినబంటు'కు మంత్రి హోదా కల్పించిన వైఎస్ జగన్

Saturday, June 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నమ్మినబంటుకు మంత్రి హోదా కల్పించిన వైఎస్ జగన్

కష్టకాలంలో వెన్నంటే ఉంటూ.. నమ్మకానికి మారుపేరుగా.. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మినబంటుగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి హోదా కల్పించారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతినిధి అంటే కేబినెట్ మంత్రి హోదా స్థాయి ఉన్నట్లే. అంటే ఇకపై విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రితో సమానం అన్న మాట. కాగా.. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.

నాడు వైఎస్‌కు.. నేడు జగన్‌కు!

ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా.. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే విజయసాయిరెడ్డికి మంచి పేరుంది. మరీ ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీతో విజయసాయికి మంచి సంబంధాలున్నాయి. అందుకే ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారిని ఇబ్బంది పెట్టాలని వైఎస్ మరణాంతరం ఆయనపై కూడా అభియోగాలు మోపి వైఎస్ జగన్‌తో పాటు విజయసాయిరెడ్డిని జైలులో పెట్టారని అంటుంటారు. అంతేకాదు.. వైఎస్ ఫ్యామిలీ వల్ల విజయసాయి జైలుకు వెళ్లాల్సి వచ్చినా.. అధికార పార్టీల నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ ఆయన ఎన్నడూ లొంగిపోలేదు.. ఇక్కడే జగన్‌కు మంచి నమ్మకస్తుడుగా.. నమ్మినబంటుగా ఆయన మారిపోయారు.

మోదీదో డైరెక్ట్..!

అందుకే తనకు కష్టకాలంలో వెన్నంటే ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా నియమించడం జరిగింది. అనంతరం ఢిల్లీ వేదికగా విజయసాయిరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డే చూసుకునేవారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి అది మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీకి బాగా దగ్గరయ్యారు. అంతేకాదు.. ప్రధానిని కలవాలంటే ఎలాంటి అపాయిట్మెంట్ లేకుండానే విజయసాయిరెడ్డి కలిసేవారంటే అర్థం చేస్కోవచ్చు. సో.. తాజాగా ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా జగన్ నియమించడంతో విజయసాయిరెడ్డిపై మరింత బాధ్యతలు పెరగనున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.