సైరాలో విజయ్ సేతుప‌తి పాత్ర ఏంటంటే?

  • IndiaGlitz, [Thursday,December 13 2018]

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా టైటిల్ పాత్రలో న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. చిరంజీవి 151వ చిత్ర‌మిది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో.. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో కూడా విడుద‌ల‌వుతుంది.

అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార వంటి భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి గురువు గోసాయి వెంక‌న్న‌, న‌ర‌సింహారెడ్డి భార్య సిద్ధ‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార న‌టిస్తున్నారు. కిచ్చా సుదీప్ అవుకురాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి పాత్ర‌కు సంబంధించిన వివ‌రాలు తెలిశాయి. వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం విజ‌య్ సేతుప‌తి రాజా పాండి అనే ట్రైబ‌ల్ నాయకుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బ్రిటీష్‌వారికి ఉయ్యాల‌వాడ ఎదురు తిరిగిన‌ప్పుడు ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డిన వారిలో రాజా పాండి ఒక‌రు.

More News

'వెంకీమామ‌' లో శ్రియ రావ‌డానికి కార‌ణం...

యంగ్ హీరో వ‌రుణ్ తేజ్‌తో విక్ట‌రీ వెంక‌టేశ్ చేసిన 'ఎఫ్ 2' వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

చెర్రీతో ఈషా స్పెష‌ల్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `విన‌య విధేయ రామ‌`. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం  పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవాల్సి ఉంది.

విజ‌య్ దేవ‌ర క్రేజీ ప్రాజెక్ట్‌..?

విజ‌య్ దేవ‌ర‌కొండ తెలుగుతో పాటు త‌మిళంలో కూడా రాణించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఆయ‌న గ‌త చిత్రం 'నోటా' బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు.

జనవరి 25న 'మిస్టర్ మజ్ను'

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ మజ్ను'.

డిసెంబ‌ర్ 16న ఎన్టీఆర్ ట్రైల‌ర్.. 21న ఆడియో లాంఛ్..

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ హైద‌రాబాద్ లో... ఆడియో రిలీజ్ ఈవెంట్ నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 16న ట్రైల‌ర్ లాంచ్.