బాలీవుడ్ రీమేక్‌లో విజయ్ సేతుపతి..

  • IndiaGlitz, [Saturday,January 02 2021]

ఏ పాత్ర అయినా సరే.. అద్భుతంగా నటించి.. మెప్పించగల నటుడు.. విజయ్‌ సేతుపతి. అందుకే ఆయనకు అవకాశాలకేమీ కొదువ లేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తాజాగా బాలీవుడ్‌లోనూ విజయ్ సేతుపతికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో వాటికి కూడా ఓకే చెబుతూ ఫుల్ బిజిబిజీగా గడిపేస్తున్నాడు. ఓ వైపు ఆమిర్‌ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చద్దా' లో నటిస్తూనే మరోవైపు షాహిద్‌ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించడానికి రెడీ అయ్యారు. అయితే తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం కామన్‌గా జరిగేదే. అలాగే దక్షిణాదిలో విజయవంతమైన సినిమాలను బాలీవుడ్‌‌లో రీమేక్స్‌ చేస్తున్నారు. కాగా.. తాజాగా ‘మా నగరం’ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి రీమేక్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించింది. దీంతో సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి రీమేక్ చేయాలని భావిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాలో సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో ఒక పాత్రను పోషించాడు. ప్రస్తుతం ఈ బాలీవుడ్‌ రీమేక్‌లో సందీప్‌ కిషన్‌ పాత్రను విజయ్‌ సేతుపతి పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

More News

షూటింగ్‌ పూర్తికాక ముందే రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఒక రికార్డును నమోదు చేసుకుంది.

వ్యాక్సిన్ వచ్చేసింది.. కోవిషీల్డ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్

కరోనా రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు.. ఆరోగ్య సంక్షోభం.. ఆర్థిక వ్యవస్థకు దారుణమైన దెబ్బ.. పలువురి జీవితాలను రోడ్డు పాలు చేసింది. 2020 అంతా ఈ సంక్షోభంతోనే గడిచింది. అయితే 2021 మాత్రం గుడ్ న్యూస్‌ని

చిరు ‘లూసిఫర్’ నుంచి మరో అప్‌డేట్

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

పండంటి పాపకు జన్మనిచ్చిన ‘విశ్వరూపం’ ఫేమ్

‘విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ గుర్తుందా? ఆమెకు తాజాగా పండంటి పాప పుట్టింది. కొంత కాలం క్రితం ఎన్ఆర్ఐ విశాల్ జోషిని పూజా కుమార్ వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ దంపతులకు పాప పుట్టింది.

నితిన్, కీర్తి సురేష్ ల 'రంగ్ దే' మార్చి 26న విడుదల

యూత్ స్టార్ 'నితిన్', 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ' సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం ఈ 'రంగ్ దే'. 'ప్రతిభగల యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి'