‘యజమాని ఆజ్ఞాపిస్తేనే బీజేపీ చుట్టూ ప్యాకేజీ స్టార్’

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును యజమానిగా.. పవన్‌ను ప్యాకేజీ స్టార్‌గా వ్యాఖ్యానించారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ఇరువురిపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. ‘యజమాని ఆర్డరేస్తేనే ప్యాకేజీ స్టార్ బిజెపి చుట్టూ తిరుగుతున్నాడు. రాష్ట్ర బిజెపిని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ముందుగా పావలాను పంపిస్తున్నాడు బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమి లేకున్నా సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది బాబు ఎత్తుగడ’ అని విజయసాయి విమర్శించారు.

ఆఖరున ఎవరి దారి వాళ్లదే!

‘అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. బంగారు నగల సేకరణకు దిగారు. తర్వాత జోలెతో ఊరూరూ తిరుగుతున్నారు. ఆఖరున వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు’ అని వైసీపీ ఎంపీ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. విజయసాయి చేసిన ఈ వరుస ట్వీట్స్‌పై జనసేన కార్యక్తరలు, పవన్ ఫ్యాన్స్, టీడీపీ వీరాభిమానులు తీవ్ర స్థాయిలో కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు అంతే రీతిలో వైసీపీ ఫ్యాన్స్ కూడా అందుకు ప్రతి కౌంటర్లు, ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు.

More News

జనసేన కీలక ప్రకటన.. ఎల్లుండి ఏం జరగబోతోంది!?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో గాయపడిన కార్యకర్తలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన..

'ఎంత మంచివాడ‌వురా' త‌ప్ప‌కుండా అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌కు నచ్చుతుంది - స‌తీశ్ వేగేశ్న‌

జాతీయ అవార్డ్ ద‌క్కించుకున్న శ‌త‌మానం భ‌వ‌తి వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ఎంత మంచివాడ‌వురా`.

మళ్లీ రిపీట్ అయితే చూస్తూ కూర్చోం.. : పవన్ వార్నింగ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో జనసేన కార్యకర్తలు గాయపడ్డ సంగతి తెలిసిందే.

హీరోయిన్‌‌ను వెతకాలని ఫ్యాన్స్‌కు మహేశ్ రెక్వెస్ట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

'నందమూరి' అనే ఇంటిపేరుకు మచ్చ తీసుకురాను!

టాలీవుడ్‌ హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు బిజిబిజీగా ఉన్న నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా రేపు అనగా జనవరి-15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.