‘సరిలేరు నీకెవ్వరు’పై రాములమ్మ ఆసక్తికర పోస్ట్..

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. రాజకీయాల్లోకి వెళ్లి పెద్దగా రాణించలేకపోయి.. లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకట్రెండుకాదు దాదాపు 13 ఏళ్ల తర్వాత రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు-రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. 2020 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయశాంతికి సంబంధించి ‘సూర్యుడివో.. చంద్రుడివో..’ సాంగ్‌లో ఆమె మెరిసింది!. అయితే ఇంతవరకూ ఆమె పాత్ర రివీల్ కాలేదు కానీ.. తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.

రాములమ్మ పోస్ట్ ఇదీ...!
‘మనం భారతీయులం
సరిలేరు మనకెవ్వరు
సంప్రదాయంగా.. సంస్కృతి ధర్మపరంగా..
ఇది మన దేశం నేర్పిన విధానం

ఆ ఉన్నత విలువలతో కూడిన ఒక చక్కని సందేశాత్మక చిత్రంగా మీ ముందుకు వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టైటిల్ నెంబర్ నేటి సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. జనవరి 5, 2020వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా మన సినిమాను అభిమానంతో స్వాగతిస్తున్న ప్రజలకు, అభిమానులకు గౌరవ అతిథులకు ధన్యవాదాలతో.. మీ విజయశాంతి’ అని రాములమ్మ తన ఫేస్‌బుక్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టి పిన్ టూ టాప్ చేసింది. ఈ పోస్ట్‌ను మహేశ్ వీరాభిమానులు.. విజయశాంతి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

విశాఖలో ఏపీ రాజధాని.. టాలీవుడ్‌లో పెరిగిన జోష్

ఏపీ రాజధానుల అంశం పొలిటికల్‌గా ఎలా ఉన్నా.. చిత్ర పరిశ్రమకు మాత్రం మంచి జోష్‌ని ఇస్తోంది. టాలీవుడ్ నుంచి సానుకూల స్పందన వస్తోంది.

ప్రేమ వ్య‌వ‌హారంపై నోరు విప్పిన హీరో.. మ‌తం కూడా మార్చుకున్నాడు

హీరో జై.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా తెలిసిన పేరే. గ‌తంలో ఆయ‌న న‌టించిన త‌మిళ చిత్రం `జ‌ర్నీ`

ప‌రుశురామ్‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌

ఓ సినిమా పెద్ద హిట్ట‌యితే ఆ ద‌ర్శ‌కుడికి వ‌చ్చే గుర్తింపు వేరుగా ఉంటుంది. స‌ద‌రు ద‌ర్శ‌కుడికి నిర్మాత‌లు అడ్వాన్సులు ఇచ్చి త‌మ బ్యాన‌ర్‌లో సినిమా చేయాలంటూ లాక్ చేసుకుంటారు.

చెప్ప‌క‌నే చెప్పేసిన ద‌ర్శ‌క‌ధీరుడు

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో

పౌరసత్వ బిల్లు: మరణం వస్తే మీకంటే ముందు నేనే..!

భారతదేశంలో ప్రతి ఒక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపీ పిలుపునిచ్చారు.