close
Choose your channels

13 ఏళ్ల తర్వాత రంగంలోకి దిగిన రాములమ్మ!

Monday, August 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

13 ఏళ్ల తర్వాత రంగంలోకి దిగిన రాములమ్మ!

ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి అలియాస్ రాములమ్మ రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సెకండ్ షూట్‌లో దాదాపు అన్నీ సన్నివేశాలు హీరోయిన్‌, విజయశాంతితోనే ఉంటాయని తెలుస్తోంది.

ఇందులో భాగంగా రాములమ్మతో సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఆమెను దర్శక నిర్మాతలు సెట్స్‌కు రప్పించారు. ఇవాళే విజయశాంతి రంగంలోకి దిగారంటూ దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "13 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారు మళ్లీ మేకప్ వేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆమె పెద్దగా ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే దృక్పథం, అదే డైనమిజమ్. విజయశాంతి గారికి వెల్‌కమ్" అని విజయశాంతి అద్దం ముందు ఉన్న ఓ ఫొటోను అనిల్ రావిపూడి పోస్ట్ చేశారు. కాగా ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్‌కు మహేశ్- విజయశాంతి అభిమానులు పెద్ద ఎత్తు రియాక్ట్ అవుతారో మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.