ఇంద్రకీలాద్రి : హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. వాష్‌రూంలో బంగారం, గుట్టువిప్పిన టాస్క్‌ఫోర్స్

  • IndiaGlitz, [Tuesday,May 10 2022]

విజయవాడ కనక దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మహామండపంలోని ఆరో అంతస్థులో వున్న అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సమయంలో బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించినట్టు అధికారులు గుర్తించారు. ఎస్పీఎఫ్ తనిఖీల్లో నల్లపూసల చైన్, ఒక ఉంగరం, రెండు గిల్టు ఉంగరాలు, బుట్ట దుద్దులు బయటపడడంతో అధికారులు ఖంగుతిన్నారు.

మహామండపం దగ్గర ఉన్న వాష్ రూమ్‌లో ఈ బంగారాన్ని పోలీసులు గుర్తించారు. అపహరించేందుకు యత్నించిన బంగారం విలువ దాదాపు ఐదు గ్రాములపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ బంగారాన్ని ఎవరు దొంగిలించారనే విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. అయితే ఇంత జరిగినా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.. ఇంద్రకీలాద్రిపై వున్న 41 హుండీల్లో 19 రోజుల్లో వచ్చిన కానుకలను లెక్కించగా 2.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పదిగంటల పాటు దేవస్థానం సిబ్బందితోపాటు సేవా సంస్థల సభ్యులు కానుకల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 586 గ్రాముల బంగారం, 6.060 కిలోల వెండి వస్తువులను భక్తులు అమ్మవారికి సమర్పించినట్లు అధికారులు ప్రకటించారు.

More News

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలింపు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజమౌళితో సినిమా చేస్తే ఏ హీరోకి పేరు రాదు.. కోటా సంచలన వ్యాఖ్యలు

సినిమా అంటే కేవలం హీరో, కథ మాత్రమే కాదు.. క్రియేటివిటీ అని చాటి చెప్పిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి.

చర్యలు తీసుకోకుండా, తల్లి పెంపకమే తప్పు అంటారా... ఏపీలో అత్యాచారాలపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలపై అత్యాచారాలు, వేధింపులపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మేజర్ ట్రైలర్ : చూస్తున్నంత సేపు ఉద్వేగం.. సెల్యూట్ కొట్టాల్సిందే

26/11 ముంబయి ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ హీరోగా ‘‘మేజర్’’

ఒక్కసారి అవకాశమివ్వండి.. కోట్ల మంది కన్నీరు తుడుస్తా : కౌలు రైతుల భరోసా యాత్రలో పవన్

ఒక్కసారి అవకాశమిస్తే.. కోట్ల మంది కన్నీరు తుడుస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.