రూ.100 కోట్ల ఆఫర్ తిరస్కరణ.. థియేటర్‌లోనే సుదీప్ ‘‘విక్రాంత్ రోణా’’

  • IndiaGlitz, [Saturday,January 08 2022]

క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుదీప్. ఆ తర్వాత బాహుబలి సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది కాసేపైనా ఆకట్టుకున్నాడు. ఆ క్రేజ్‌తో ఇప్పుడు సుదీప్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. సుదీప్ నటిస్తున్న తాజా చిత్రం విక్రాంత్ రోణ‌. పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌తో అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చిన ఈ త్రీడీ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు జాక్ మంజునాథ్‌ తెలియ‌జేశారు. ఈ మూవీలో నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు.

విక్రాంత్ రోణకు ఓటీటీ వైపు నుంచి భారీ ఆఫర్ వచ్చిందనీ, దీంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్తలు కొన్ని రోజులుగా ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 24వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్‌ రోణా మల్టిలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ నిర్మాతలు. అలంకార్‌ పాండ్యన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

More News

సినిమాలను నియంత్రించినట్లు.. వీటిని కంట్రోల్ చేయగలారా: ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.

బెజవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య.. సత్రంలో తల్లీకొడుకు, కృష్ణానదిలో దూకి తండ్రీకొడుకు

ఇటీవల కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్ చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

గుర్తుపట్టలేనంతంగా మారిపోయా.. మైండ్ బ్లాంక్ అయ్యింది: కోవిడ్ అనుభవాలు పంచుకున్న దీపికా

దేశంలో మొదటి, రెండో దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో లక్షలాది మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో పలువురు సెలబ్రెటీలు సైతం వున్నారు.

తమిళ చిత్ర సీమలో కోవిడ్ కలకలం.. కట్టప్పకు పాజిటివ్, పరిస్ధితి విషమం..?

సినీ పరిశ్రమలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే కమల్ హాసన్, విక్రం, వడివేలు, మహేశ్‌బాబు , మంచు లక్ష్మి, త్రిష, మీనా

కరోనాతో ఐసీయూలో .. రెండు రోజుల్లో నా శవానికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్ కంటతడి

2019 చివరిలో చైనాలో పుట్టిన కోవిడ్ మహమ్మారి మనిషిని నాలుగు గోడల మధ్య బందీని సంగతి తెలిసిందే.