‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లిపై గొడవకు దిగిన గ్రామస్తులు

  • IndiaGlitz, [Wednesday,March 10 2021]

‘కేజీఎఫ్’ హీరో.. కన్నడ స్టార్ యశ్ తల్లిపై ఆమె సొంత గ్రామస్తులంతా గొడవకు దిగారు. యశ్ తల్లి తమ పొలం నుంచి ఉన్న దారిని మూసివేయడంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అదేమని ప్రశ్నించినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆ గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. యశ్‌ తల్లి పుష్పలత స్వగ్రామం కర్ణాటకలోని హాసన్‌ జిల్లా. అక్కడ యశ్ కుటుంబానికి సొంత ఇల్లు ఉంది. అయితే ఇటీవల యశ్ కుటుంబం హాసన్‌ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.

అంత వరకూ బాగానే ఉంది కానీ ఆ 80 ఎకరాల పొలం నుంచి ఇతర రైతులకు తమ పొలాలకు వెళ్లాల్సిన బాట ఉంది. దానిని పుష్పలత మూసి వేయించడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదేమని ప్రశ్నించినా ఆమె వినలేదు. తమ పొలాలకు దారిని మూసివేశారంటూ గ్రామస్తులు యశ్‌ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావడంతో పాటు ఆమె వినే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్తులు చేసేదేమీ లేక దుద్ద పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు ఎలా వెళతామని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పటంలో ఉన్నట్లు దారి వదలాల్సిందేనని డిమాండ్‌ చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకొంటున్న భూముల్లోకి దారిని మూసివేయడం తగదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై చర్చించేందుకు హీరో యశ్‌ మంగళవారం తిమ్మాపురకు వెళ్లారు. పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కి పిలిపించి పంచాయితీ చేశారు. యశ్‌ వస్తున్నట్లు తెలిసి వందలాది మంది అభిమానులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.

More News

చిరుకి డీహైడ్రేషన్.. అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరు ఖమ్మంలో ఉన్నారు.

నాకు సిగ్గేసింది నీ మెచ్యూరిటీ చేసి: అల్లు అర్జున్

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వరస విజయాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా చావు కబురు చల్లగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది.

గో సంరక్షుడు, గాయకుడు పెంచల్ దాస్‌ను సన్మానించిన పవన్

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన గో సంరక్షుడు చాంద్ బాషాను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సన్మానించారు.

బాలీవుడ్ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చిత్రం చేయనున్న ప్రభాస్..!

‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కటే సినిమాకు కట్టుబడి ఉండాలనే నియమానికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టున్నాడు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు.

'గాలి సంప‌త్' ఆడియన్స్‌ని ‌ తప్పకుండా థ్రిల్ చేస్తుంది - అనిల్ రావిపూడి

`ప‌టాస్`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి వ‌రుసగా ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించి ప్ర‌స్తుతం ఎఫ్ 3 చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం