అది డిసైడ్ చేయాల్సింది పవన్ కళ్యాణ్: వినాయక్

మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో ముణ్దు వరుసలో ఉంటారు వినాయక్. వినాయక్ సినిమాలు అనగానే.. ఫ్యాక్షన్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ గుర్తుకొస్తాయి. హీరోయిజంని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసే దర్శకులలో వినాయక్ ఒకరు. ఇటీవల వినాయక్ కాస్త వెనుకబడప్పటికీ సరైన టైం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: రూ. 175 కోట్ల బంగ్లాలో బిజినెస్ మ్యాన్ తో పవన్ హీరోయిన్ సహజీవనం?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినాయక్ టాలీవుడ్ స్టార్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను తీసిన చిత్రాలు అప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా తీశానని అన్నారు. మంచి యాక్షన్ మూవీ తీయాల్సి వస్తే ఇప్పటి ట్రెండ్ కు తగ్గ కథ ఉండాల్సిందే. ప్రేక్షకులు మంచి కథ కోరుకుంటున్నారు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చే చిత్రాలని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని వినాయక్ అన్నారు.

మహేష్, పవన్ కళ్యాణ్ లలో ఒకరితో సినిమా తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అని ప్రశ్నించగా.. వినాయక్ పవన్ కళ్యాణ్ అని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే పవన్ తో నాకు మంచి రాపో ఉంది. మహేష్ తో మాత్రం తనకు అంత రాపో లేదని, తాము కలుసుకున్నది చాలా తక్కువ అని అన్నారు.

మరి పవన్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించగా.. అది ఆయన డిసైడ్ చేయాల్సిన విషయం. పవన్, చిరంజీవి గారి లాంటి స్టార్స్ ని గమనిస్తే.. ఈ టైం లో తాము యాక్షన్ మూవీ చేయాలా లేక పొలిటికల్ మూవీ చేయాలా అనేది వారు డిసైడ్ అవుతారని వినాయక్ అన్నారు.

ఇక బాలయ్య, చిరంజీవి లలో ఎవరు అని ప్రశ్నించగా., తనకు ఇద్దరూ మంచి ఆప్తులు అని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను అని అన్నారు. తన చిత్రాల్లో ఏదైనా మూవీ కథ మార్చాల్సి వస్తే అది యోగి అని అన్నారు. ప్రభాస్, వినాయక్ కాంబోలో వచ్చిన యోగి నిరాశపరిచింది. ఇక పవన్, రానా నటిస్తున్న అయ్యప్పన్ కోషియం రీమేక్ లో తాను చిన్న పాత్ర చేస్తున్న విషయాన్ని వినాయక్ ధృవీకరించారు. ప్రస్తుతం వినాయక్ హిందీలో బెల్లం కొండశ్రీనివాస్ హీరోగా ఛత్రపతి రీమేక్ చేస్తున్నారు.

More News

రూ. 175 కోట్ల బంగ్లాలో బిజినెస్ మ్యాన్ తో పవన్ హీరోయిన్ సహజీవనం?

శ్రీలంక అందాల సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

హీరోయిన్ న్యూడ్ పిక్ వైరల్.. అందాలకు అదొక్కటే అడ్డు!

బుల్లితెరపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన హాట్ బ్యూటీ షమా సికిందర్. వెండి తెరపై కూడా తన మార్క్ టాలెంట్ ప్రదర్శిస్తోంది.

మహేష్ బాబు కొడుకా మజాకా.. గర్వపడే ఘనత సాధించిన గౌతమ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు కుటుంబానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చే నటుడు మహేష్.

సౌత్ ప్రొడ్యూసర్ ఒక రాత్రి తనతో గడపమన్నాడు: సీనియర్ హీరోయిన్

రెండేళ్ల క్రితం అటు బాలీవుడ్, టాలీవుడ్ లో మీటూ, కాస్టింగ్ కౌచ్ సంఘటనలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

బ్రేకింగ్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా సత్య నాదెళ్ల.. శిఖరాగ్రాన తెలుగు తేజం!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల 2014లో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెసిందే.