గుడ్ న్యూస్ చెప్పిన విరుష్క..

  • IndiaGlitz, [Thursday,August 27 2020]

టీమ్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య అనుష్కశర్మ తల్లి కాబోతోందని వెల్లడించాడు. త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నామని వెల్లడిస్తూ ఓ పిక్‌ను పోస్ట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా అనుష్కతో కలిసి దిగిన పిక్‌ను అభిమానులతో పంచుకున్నాడు.

‘మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాం. 2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోంది’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. బేబీ బంప్‌తో ఉన్న అనుష్క ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీకి అభిమానులేమైనా తక్కువా..? ట్విట్టర్‌లో శుభాకాంక్షల మోత మోగిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం విరుష్క జంటకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేస్తున్నారు.

విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ తార అనుష్క శర్మల ప్రేమ వివాహం 2017, డిసెంబర్ 11న జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. 2013లో ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌ సందర్భంగా కోహ్లీ, అనుష్క తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సమయంలోనే వారి ప్రేమ చిగురించింది.

More News

పవన్‌కి కేంద్ర మంత్రి పదవి.. పార్టీ పరిస్థితేంటో..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

తెలంగాణలో కొత్తగా 2795 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. మరోవైపు తెలంగాణలో పరీక్షల సంఖ్యను సైతం పెంచారు.

ఎస్పీ బాలు హెల్త్‌పై తాజా అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి క్రమ క్రమంగా మెరుగవుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌తో పాటు ఎంజీఎం వైద్య నిపుణులు వెల్లడించారు.

క‌రోనాను జయించ‌డ‌మే మనంద‌రి ధ్యేయం - నంద‌మూరి బాల‌కృష్ణ‌

కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ క‌రోనాను జ‌యించాల‌ని అగ్ర క‌థానాయ‌కుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్

సూర్య నిర్ణ‌యం డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫైర్‌.. డైరెక్ట‌ర్ హ‌రి లేఖ‌

సూర్య‌.. త‌నే హీరోగా న‌టిస్తూ నిర్మించిన చిత్రం ‘శూర‌రై పోట్రు’. ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా పేరుతో తెలుగులో