చేతులు కలపనున్న విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఓ బృహత్తర కార్యక్రమం కోసం చేతులు కలపబోతున్నారు. వివరాల్లోకెళ్తే.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. దీని కారణంగా ప్రాణాలు పోతున్నాయి. కుటుంబం అండ కోల్పోవడంతో రోడ్డున పడుతుంది.
మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి ప్రముఖ టీవీ ఛానెల్ ఎన్డీటీవీ ఓ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అందుకోసం విరాట్ కోహ్లీతో పాటు, టాలీవుడ్ నుండి ఎన్టీఆర్ను బ్రాండ్ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతలుగా ఉపయోగించుకోనున్నారు. వీరే కాకుండా మరో ఏడుగురు సెలబ్రిటీలు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమంలో భాగమవుతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన వార్త అధికారికంగా వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.