మే చివరి వారంలో విశాల్‌ 'అభిమన్యుడు' 

  • IndiaGlitz, [Wednesday,May 16 2018]

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు.

సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవల తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ 'అభిమన్యుడు' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. తమిళ్‌లో ఇటీవల విడుదలైన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.

రివ్యూస్‌ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. 'రంగస్థలం', 'మహానటి' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ సమంతకు 'ఇరుంబుతెరై' హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచింది. తమిళ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా చాలా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

More News

'జంబ‌ల‌కిడి పంబ‌' జూన్ 14న విడుదల

`జంబ‌ల‌కిడి పంబ‌` అనే పేరు విన‌గానే సీనియ‌ర్ న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చేసిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది.

'నా నువ్వే' ...ల‌వ్వ‌బుల్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'నా నువ్వే'.

'ఈ మాయ పేరేమిటో' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌

సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'.

మూడు నెల‌ల్లో... మూడు సినిమాలు

గ‌తేడాది ఆరు చిత్రాల‌ను విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా.. డబుల్ హ్యాట్రిక్ విజ‌యాల‌తో నిర్మాత‌గా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు దిల్ రాజు.

నాని విల‌న్‌తో నాగ్ హీరోయిన్‌

సుమంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మ‌ళ్ళీ రావా చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది