'హ‌ర్లా ఫర్లా' సాంగ్‌తో ఆక‌ట్టుకుంటోన్న విశాల్ 'చ‌క్ర'

  • IndiaGlitz, [Saturday,December 19 2020]

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'చ‌క్ర‌'. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్నఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‌ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. ఈ మూవీ యాక్ష‌న్ హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 10వ చిత్రం కావ‌డం విశేషం. తాజాగా ఈ చిత్రం నుండి యువ‌న్ సంగీత సారథ్యం వ‌హించిన 'హ‌ర్లా ఫర్లా' సాంగ్‌'ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

'నీ చూపుల్లోనే నాటీ గ్రాఫిటీ.. రైసైందే ల‌బ్‌డ‌బ్ హార్టుల్లోని గ్రావిటీ..తాకేనా ఆ మేఘాల్ని..నా వ‌ల‌న నీ న‌వ్వుల్నే..కొట్టి కొట్టి క‌న్ను చంప‌మాక‌లా..కిక్కు రేపుతున్న మ‌త్తు మాట‌లా..కొత్త కొత్త‌గున్న బుట్ట‌బొమ్మ‌లా హ‌ర్లా..ఫ‌ర్లా' అంటూ జోష్‌ఫుల్‌గా సాగే ఈ పాట‌కి డా. చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి నేటి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్లు సాహిత్యం అందించ‌గా రంజిత్‌, సంజ‌న క‌ల్‌మంజి ఫుల్ ఎన‌ర్జీతో ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌ నేప‌థ్యంలో సరికొత్త క‌థాక‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ మూవీ విడుద‌ల‌కానుంది.

యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

More News

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయమందిస్తూ.. ఐదుగురి దుర్మరణం

ముక్కూ మొహం తెలియకున్నా.. తోటి మనిషి ప్రమాదంలో గాయపడ్డాడని వారి హృదయం తల్లడిల్లిపోయింది.

తెలంగాణలో రాజా సాబ్ కొడుకో.. నిజాం చెంచానో సీఎం కాడు: తరుణ్ ఛుగ్

తెలంగాణ రాష్ట్రానికి 2023లో సామాన్యుడే సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ప్రకటించారు.

నన్నూ, ఆర్జీవీని చంపేయండి: నట్టి కుమార్

తనను, ఆర్జీవీని చంపేసి అనంతరం థియేటర్‌ను ధ్వంసం చేయాలని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు.

సినీ ఇండస్ట్రీకి రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన ఏపీ..

లాక్‌డౌన్ కారణంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిన పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది సినీ పరిశ్రమే. ఆ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

సింగర్ సునీతను పెళ్లెప్పుడని అడిగితే..

గత కొద్ది రోజులుగా సింగర్ సునీత తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు.