హీరో విశాల్ బండారం బ‌య‌ట‌పెడ‌తానంటున్న ఉద్యోగి!!

  • IndiaGlitz, [Tuesday,July 07 2020]

సినిమాల సంగ‌తేమో కానీ.. వివాదాల్లో విశాల్ ఎప్పుడూ ముందుంటున్నాడు. ముఖ్యంగా న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శి, ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత ఈ వివాదాలు మ‌రింత ఎక్కువ‌య్యాయి. తాజాగా ఇప్పుడు ఈయ‌న చుట్టూ మ‌రో వివాదం నెల‌కొంది. వివ‌రాల్లోకెళ్తే.. త‌న‌ ఆఫీస్‌లో ప‌నిచేసే ర‌మ్య అనే మ‌హిళా ఉద్యోగి ఆరు నెల‌ల్లో 45 ల‌క్ష‌ల రూపాయ‌ల మోసం చేసింద‌ని భావించిన విశాల్ ఆమెపై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ర‌మ్య ఈ వివాదంపై ఘాటుగా స్పందించింది. నిజానికి విశాల్ హీరో కాదు.. విల‌న్ అన్నారు ర‌మ్య‌.

మీడియాతో వివాదంపై మాట్లాడిన ర‌మ్య త‌న‌కే పాపం తెలియ‌ద‌న్నారు. అంతే కాకుండా విశాల్ చాలా సంవ‌త్స‌రాలుగా గ‌వ‌ర్న‌మెంట్‌ను మోసం చేస్తున్నార‌ని, ప్ర‌భుత్వానికి ఆయ‌న టీడీఎస్ క‌ట్ట‌డం లేద‌ని తెలిపారు. త‌న వ‌ద్ద అందుకు త‌గ్గ ఆధారాలున్నాయ‌ని ఆమె పేర్కొన్నారు. మ‌రి దీనిపై విశాల్ అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే విశాల్ ద‌క్షిణాది నాలుగు భాష‌ల్లో చ‌క్ర అనే మూవీని సిద్ధం చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. శ్ర‌ద్దా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్‌.

More News

ఇప్పుడే చెప్ప‌మంటున్న బోయ‌పాటి

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

‘పుష్ప’ కోసం భారీ ప్లాన్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం ‘పుష్ప’.

మరో సినిమాకు రజినీ సైన్... వచ్చే ఏడాది కూడా పార్టీ లేనట్టేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం వచ్చే ఏడాది కూడా జరిగేలా కనిపించడం లేదు.

ప్రభాస్ అభిమానులకు దూరమవుతున్నాడా?

హీరోల్లో ప్రభాస్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. కానీ ఈ మధ్య కాలంలో ఆయనను అభిమానులు బాగా మిస్ అవుతున్నారు.

నిమ్స్‌లో జరగాల్సిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. క్లినికల్ ట్రయల్స్‌ను దేశ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది.