శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ 'విశాల్ 'మదగజరాజా'

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

ఇటీవల జరిగిన తమిళ నడిగర్‌ సంఘం' ఎన్నికల్లో హేమాహేమీలను ఢీకొని ఘన విజయం సాధించి.. వార్తల్లో వ్యక్తి'గా నిలిచిన సంచలన కథానాయకుడు విశాల్‌ తాజా తమిళ చిత్రం మద గజ రాజా' తెలుగు హక్కులు శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ సొంతం చేసుకొంది. విశాల్‌ సరసన అంజలి, వరలక్ష్మీశరత్‌కుమార్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్‌ సి. దర్శకుడు. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను జెమిని ఫిలిం సర్క్యూట్ సమర్పణలో సన్నితి క్రియేషన్స్‌'తో కలిసి శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై యువ నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి-ప్రసాద్‌ సన్నితి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఘన విజయం సాధించిన జిల్లా' అనంతరం శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ నుంచి వస్తున్న మద గజ రాజా' తెలుగు అనువాదానికి టైటిల్‌ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. సోనూసూద్‌, ప్రకాష్‌రాజ్‌, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్‌ సదా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయగా.. ప్రముఖ కథానాయకుడు ఆర్య అతిధి పాత్ర పోషించడం విశేషం.

నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి-ప్రసాద్‌ సన్నితి మాట్లాడుతూ.. జిల్లా' అనంతరం మద గజ రాజా'ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తున్న మేము' నిర్మాణంలో సైతం మేము పాలుపంచుకొంటున్నాం. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో రూపొందిన మద గజ రాజా'లోని ప్రతి సన్నివేశం కనుల విందుగా ఉంటుంది. విశాల్‌, అంజలి, ప్రకాష్‌రాజ్‌, సోనుసూద్‌, సుబ్బరాజు, సదా, ఆర్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం కావడంతో.. స్ట్రయిట్‌ సినిమా చూస్తున్నట్లుగానే ఉంటుంది. డబ్బింగ్‌ పరంగానూ అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకొన్నాం. తెలుగులో టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నాం. ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలో విశాల్‌కు గల ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను మరింతగా పెంచే ప్రతిష్టాత్మక చిత్రమిది' అన్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రిచర్డ్‌, సంగీతం: విజయ్‌ ఆంటోని, సమర్పణ: జెమిని ఫిలిం సర్క్యూట్, బ్యానర్స్‌: శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌-సన్నితి క్రియేషన్స్‌, నిర్మాతలు: తమటం కుమార్‌రెడ్డి-ప్రసాద్‌ సన్నితి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుందర్‌.సి!!

More News

శ్రీను వైట్ల పై కోన కేసు

డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల పై భార్య రూపా వైట్ల కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు జ‌రుగుతుంది.

సోషల్ మీడియా లో చేరిన లారెన్స్

కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా, హీరోగా ఎదిగిన రాఘవేంద్ర లారెన్స్ ప్రస్తుతం దర్శకుడుగా చాలా బిజీగా మారిపోయాడు

జనసేనకు గుర్తింపు వచ్చింది....

కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత అన్నయ్య చిరంజీవితో విభేదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు వ్యతిరేకంగా జనసేన అనే పార్టీని స్థాపించాడు.

'చీకటిరాజ్యం' తమిళ్ సెన్సార్ పూర్తి...

కమల్ హాసన్ హీరోగా రాజేస్ ఎమ్.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘చీకటిరాజ్యం’.

బరిలోకి 'బాహుబలి' నాయికలు

టాలీవుడ్ ఆల్టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ''బాహుబలి''మూవీ.ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో తమన్నా,అనుష్క హీరోయిన్లుగా నటించారు.