సీక్వెల్ కు సిద్ధమవుతున్న విశాల్...

  • IndiaGlitz, [Tuesday,November 10 2015]

తమిళ స్టార్ విశాల్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో విశాల్ సినిమాలు తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. రీసెంట్ గా నడిగర్ సంఘం ఎన్నికల్లో సెక్రటరీగా ఎన్నికైన విశాల్ ఇప్పుడు తన సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఎప్పటి నుండో విశాల్ తన కెరీర్ ప్రారంభంలో సూపర్ హిట్ అయిన పందెం కోడి' చిత్రానికి సీక్వెల్ చేస్తానని అంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సీక్వెల్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 2005లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈ సీక్వెల్ కు కూడా లింగుస్వామి దర్శకత్వం చేయబోతున్నాడు. ఈ సినిమాలో రాజ్ కిరణ్, మీరా జాస్మిన్ తదితరులు నటిస్తారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారట. సినిమాను ఫిభ్రవరి నుండి స్టార్ట్ చేస్తారని కోలీవుడ్ సమాచారం.

More News

శ్రుతి హాస‌న్ ఫుల్ హ్యాపీ

గ‌త దీపావ‌ళికి వ‌చ్చిన 'పూజై' (తెలుగులో 'పూజ‌')తో త‌మిళంలో తొలిసారిగా విజ‌యాన్ని అందుకుంది శ్రుతి హాస‌న్‌.

'మేము' రిలీజ్ డేట్

సూర్య, అమలాపాల్, బిందుమాధవి, కార్తీక్ కుమార్ తదితరులు ప్రదాన తారాగణంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పసంగ2’.

సూర్య చేతుల మీదుగా 'మేము' ఆడియో రిలీజ్

సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పసంగ 2’. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు.

'చిరునవ్వుతో' 15 ఏళ్లు

2000కి గానూ 'ఉత్తమ చిత్రం' గా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్న సినిమా ''చిరునవ్వుతో''.వేణు,షాహిన్ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్,ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించారు.

'దేవుళ్లు' కి 15 ఏళ్లు

ఆడియోలోని అన్ని పాటలు ఆదరణ పొందడం అరుదుగా జరుగుతుంది.ఒక్కో తరహా భక్తిగీతంతో పాటు..రెండు సందర్భానుసారంగా పాటలతో ఉన్న 'దేవుళ్లు' ఆడియో కూడా ఇలాంటి అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.