రాజ‌కీయాల్లోకి విశాల్‌..!

  • IndiaGlitz, [Tuesday,December 15 2020]

తెలుగు ప్రేక్ష‌కులకు సుప‌రిచితుడైన తమిళ హీరో విశాల్ రాజ‌కీయ రంగ ప్రవేశం చేయ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ మీడియాకు తెలియ‌జేశాడు. న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా కొన‌సాగిన విశాల్.. వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడులో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఏదో ఒక నియోజ‌క వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల‌ని అనుకుంటున్నాడు. అందుకోసం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఎన్నిక‌ల గెలుపు కోసం త‌న అభిమాన సంఘాల నాయ‌కుల‌తో విశాల్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన ఆర్‌.కె.న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో విశాల్ నామినేష‌న్ వేశాడు. అయితే ఎందుక‌నో చివ‌రి నిమిషంలో ఈసీ నామినేష‌న్‌ను రిజెక్ట్ చేసింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌గు ప్రణాళిక‌ల‌తో పాల్గొన‌బోతున్నాడు. అయితే ఏ నియోజ‌క వ‌ర్గం నుండి విశాల్ పోటీ చేస్తాడ‌నేది తెలియ‌డం లేదు. అయితే త‌మిళ‌నాడు నిర్మాత‌ల సంఘం, న‌డిగ‌ర్ సంఘాల‌కు రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ద‌ర్శ‌కుడు చేర‌న్‌, సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత రాజేంద్ర‌న్ డిమాండ్ చేస్తున్నారు. మ‌రి విశాల్.. ఇత‌రులు డిమాండ్ చేసిన‌ట్లు త‌న ప‌దవుల‌కు రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పాల్గొంటాడో లేదో చూడాలి.

More News

2020 రికార్డ్ ‘వకీల్‌సాబ్’దే

2020.. చాలా కాలం తర్వాత ప్రపంచాన్ని వణికించింది. ఎక్కడికక్కడ స్తంభింపజేసింది. ఈ ఏడాది ఒక్కొక్కరికీ ఒక్కో ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ఇక సినీ ప్రపంచం అయితే ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికీ కోలుకోలేదు.

గూగుల్ సర్వర్లు గంటపాటు డౌన్

గూగుల్ సర్వర్లు ఇవాళ షాకింగ్‌గా గంట పాటు పని చేయకుండా పోయాయి. సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారిగా గూగుల్‌కు చెందిన ప్రధాన సర్వీసుులు జీమెయిల్, యూట్యూబ్, ఫోటోస్,

'ఆచార్య' రిలీజ్ డేట్ ఖ‌రారైందా..?

గ‌త ఏడాది ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి అంత స్కోప్ లేకుండా పోయింది. తాజాగా ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న

బిగ్‌బాస్ హౌస్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ద్దతు ఎవ‌రికో తెలుసా?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4 ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఆదివారం మోనాల్ బిగ్‌బాస్ ఇంటి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అభిజీత్‌, అఖిల్‌, హారిక‌, అరియానా, సోహైల్ ఫైన‌ల్‌కు చేరుకున్నారు.

టీఆర్‌ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారంపై స్పందించిన కిషన్‌రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు..