'బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్' చిత్ర‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

  • IndiaGlitz, [Thursday,September 03 2020]

యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌.  ఈ రోజు నందు పుట్టిన రోజు సందర్భంగా నందు ని 'పోతురాజు' గా పరిచయం చేస్తూ 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ ఈ చిత్ర‌ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో హీరో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ కి అభిమానిగా న‌టిస్తున్నారు.

ఈ క్యారెక్ట‌ర్ చాలా వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. పోతురాజుగా క‌నిపించ‌బోతున్న నందు క్యారెక్ట‌ర్ కి ధిటుగానే హీరోయిన్ ర‌ష్మీ గౌత‌మ్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని, దీనికి సంబంధించిన వివరాల్ని అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించబోతున్నారు. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శ‌కునిగా చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ తో అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని  విడదులకు సిద్ధంగా ఉందిని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు.

న‌టీన‌టులు; నందు ఆనంద్ కృష్ణ‌, ర‌ష్మీ గౌత‌మ్

More News

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. తొలిసారిగా..

భారత్‌లో నిన్న కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించింది.

తెలంగాణలో కొత్తగా 2817 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజూ దాదాపు మూడు వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి.

అభిమానుల‌కు అండ‌గా నిలిచిన వారికి ప‌వ‌న్ థాంక్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం, శాంతిపురం మండ‌లంలో, ప‌వ‌న్ క‌టౌట్ క‌డుతున్న అభిమానుల‌కు విద్యుత్ ఘాతం  త‌గిలింది.

'ఆది పురుష్' లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న బాలీవుడ్ హీరో

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ ఎపిక్ విజువ‌ల్ వండ‌ర్ మూవీ ఆది పురుష్ కి సంబంధించ‌ని ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

కేంద్రం కీలక నిర్ణయం.. పబ్జీ సహా 118 యాప్‌లపై నిషేధం..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు మరోసారి భారత్ షాక్ ఇచ్చింది.