వితికాకు షాకిచ్చిన వరుణ్.. వార్నింగ్ ఇచ్చిన వైఫ్!

  • IndiaGlitz, [Friday,August 16 2019]

పంద్రాగస్టు.. యావత్ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో మునిగింది. ఆగస్టు-15 వేడుకలను దేశ పౌరులంతా ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. అయితే బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు కూడా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాబా భాస్కర్ తన ఆప్త మిత్రుడు జాఫర్‌కి హౌస్ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. జాఫర్ హౌస్‌ నుంచి వెళ్లిపోవడంతో.. మిస్ యూ జాఫర్ అంటూ శ్రీముఖితో కలిసి బాబా శుభాకాంక్షలు తెలిపారు.

షాకిచ్చిన వరుణ్!
ఈ వ్యవహారం అనంతరం.. కిచెన్‌లో వరుణ్-వితికాల మధ్య డిస్కషన్ జరిగింది. వరుణ్ పాత్రలు తోముతుండగా.. వితికా అక్కడికొచ్చి అలా కాదు వరుణ్ అని చెప్పడంతో రచ్చ మొదలైంది. ‘హే.. నువ్ మ్యాన్ హ్యాడ్లింగ్ చేస్తున్నావ్. నా పని నేను చేసుకోనివ్వు ఎందుకు ఊరికే డిస్టబ్ చేస్తున్నావ్.. నువ్ నా పనిలో ఇన్వాల్వ్ కాకు’ అని వితికాకు వరుణ్ షాకిచ్చాడు. దీంతో ఒకింత బాధపడిన వితికా.. ‘ఇదిగో నువ్విలా మాట్లాడితే నేను కిచెన్ డిపార్ట్‌మెంట్ నుంచి మారిపోతా’ అంటూ వితికా వార్నింగ్ ఇచ్చింది. వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుండగానే.. పునర్నవి కలుగజేసుకుని మీరిలానే గొడవపడుతుంటే తాను కూడా కిచెన్ నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో వితికా సీరియస్ అయ్యి హే.. వెళ్లిపో అంటూ అసహనంతో అన్నది. అలాగే హిమజ, శ్రీముఖి ఇద్దరూ కాసేపట్ గ్లేమ్ ప్లాన్‌తో ఆడుకున్నారు.

కంటెస్టెంట్స్.. అదుర్స్!
ఈ సందర్భంగా పంద్రాగస్టు వేడుకలు మౌస్‌లో ఘనంగా జరిగాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వేడుకలతో బిగ్‌బాస్ హౌస్ కళకళలాడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆసక్తికర స్కిట్‌లు డాన్స్‌లతో పాటు భారత్ మాతాకి జై నినాదాలతో హౌస్ మార్మోగింది. శ్రీముఖి, అలీలు యాంకర్స్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్‌టైనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. స్త్రీ, పురుష సమానత్వంపై మహేష్, రవి, పునర్నవి, వితికా, అషు‌లు స్కిట్‌తో అదరగొట్టేశారు. ఆడవాళ్లు గొప్పా.. మగవాళ్ల గొప్పా అన్ని విషయంపై ఎవరి వాదనను వాళ్లు వినిపించారు. మగవాళ్లు ఎంతమందితో నైనా మాట్లాడొచ్చు.. ఎవరితోనైనా ఉండొచ్చని రవి, మహేష్‌లు తమ వాదనను వినిపించగా.. వీళ్లకు గట్టి కౌంటర్ ఇస్తూ అషు, వితికా, పునర్నవిలు చెలరేగిపోయారు. మరి ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఏమో వేచి చూడాల్సిందే.

More News

మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న జాతీయ ఉత్త‌మ‌ న‌టికి కీర్తి సురేష్

`మ‌హాన‌టి` చిత్రంలో సావిత్రిగా అద్భుత న‌ట‌న‌తో మైమ‌రిపించిన కీర్తి సురేష్ `జాతీయ ఉత్త‌మ న‌టి`గా పుర‌స్కారం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

చిన్న కుమార్తె అడ్మిషన్ కోసం అమెరికాకు వైఎస్ జగన్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్‌ నుంచి జగన్.. అమెరికా వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం..

‘2 బుల్లెట్లు కాల్చుకోవాలే.. 2 దాచుకోవాలె’ వాల్మీకీ టీజర్

వ‌రుణ్ తేజ్, అథ‌ర్వ ముర‌ళి, పూజా హెగ్డే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ సూపర్ హిట్టవ్వగా..

అనుష్కతో డేటింగ్, లవ్, పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి రెండ్రోజులకోసారి వార్తలు వస్తూనే ఉంటాయన్న విషయం విదితమే. గత కొన్ని రోజులుగా మళ్లీ ప్రభాస్ పెళ్లిపై వార్తలు షురూ అయ్యాయి. వార్తలే కాదు..

పంద్రాగస్టు నాడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.