బెదిరింపుల‌కు లొంగేది లేదు: ప్ర‌శాంత్ గౌడ్‌

  • IndiaGlitz, [Thursday,June 20 2019]

‘‘ఓటర్‌’ సినిమా విడుద విషయంలో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాని ఆపాలంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఎన్ని బెదిరింపులు వచ్చినా సినిమాని ఆపేది లేదు. నేడు(శుక్రవారం) గ్రాండ్‌గా విడుదల‌ చేస్తున్నాం’ అని నిర్మాత ప్రశాంత్‌ గౌడ్‌ అన్నారు. మంచు విష్ణు, సురభి జంటగా జి. కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓటర్‌’. జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మించారు. ఈ చిత్ర ప్రపంచ థియేట్రికల్ హక్కుల‌ను సార్ధక్‌ మూవీస్‌ పతాకంపై ప్రశాంత్‌ గౌడ్‌ దక్కించుకున్నారు.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో చిత్ర రామరీల్స్‌కి చెందిన నిర్మాత జాన్‌ సుధీర్‌ పూదోట, దర్శకుడు కార్తీక్‌పై 24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ‌ కోర్టులో కేసు వేసిన విషయం విదితమే. సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని అడ్వకేట్ వేణుకుమార్ వెల్ల‌డించారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వేణుకుమార్ మాట్లాడుతూ, ‘24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ వేసిన పిటిషన్ ని కోర్టు ఫాల్స్‌ సూట్‌గా భావించి తిరస్కరించింది. అలాగే సినిమా విడుద విషయంలో ఎలాంటి అభ్యంతరం తెల‌పలేదు. మా వాదనని ప్రశంసించింది. కావున ప్రస్తుతం ‘ఓటర్‌’ సినిమా విడుద‌ల చేసుకోవ‌చ్చు అని తెలిపింది. దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్‌ కూడా వచ్చింది’ అని అన్నారు.

సినిమా హక్కుల‌ను తీసుకున్న ప్రశాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ, ‘నేను గత 12ఏండ్లుగా చిత్ర రంగంలో ఉన్నాను. డిస్టిబ్యూటర్‌గా, నిర్మాతగా, ఫైనాన్సర్‌గా ఉన్నాను. దాదాపు 42 సినిమాలు నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేశా. ఏడు సినిమాలు నిర్మించా. జాతీయ స్థాయిలో ప్రొడ్యూస్ చేశాను. నాపై ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేవు. కానీ సినిమా ఆగిపోతుందని మార్కెట్‌లో చాలా రూమర్స్‌ ఉన్నాయి. ఈ సినిమాలోని పాయింట్‌ నచ్చి కొనుకున్నా. ఓటర్ విలువ‌ని తెలిపే చిత్రమిది. రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన ఓ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే మనం ఎలా చర్య‌లు తీసుకోవచ్చో ఇందులో ద‌ర్శ‌కుడు చర్చించారు. ఎల‌క్షన్స్‌ తర్వాత రావాల్సింది. ఈ హక్కులు తీసుకున్నాక. సినిమాపై పలు వివాదాలున్నాయని చెప్పారు. లీగల్‌గా సల‌హాలు తీసుకున్న‌ప్పుడు విడుదల‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.

ఈ నెల‌ 21న దాదాపు 370థియేటర్లలో విడుదల‌ చేస్తున్నాం. అయితే ఈ సినిమాని తీసుకున్న‌ప్పట్నుంచి మార్కెట్‌ నుంచి వివిధ రకాల‌ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. వేధింపుల‌కు గురి చేస్తున్నారు. సినిమాని ఎలా రిలీజ్‌ చేస్తారంటూ బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపు కాల్స్‌ వచ్చినా అధైర్య పడకుండా సినిమాని రిలీజ్‌ చేయాల‌ని నిర్ణ‌యించాం. నేను నా కష్టార్జితంతో కొనుక్కున్న చిత్ర‌మిది. లీగల్‌గా తీసుకున్నా. లీగల్‌గా ముందుకెళ్తున్నా. సినిమాకి సంబంధించి క్రియేటివ్‌ సైడ్‌ వివాదాలుంటే అది నాకుగానీ, నిర్మాతకి గానీ సంబంధం లేదు. ఈ నెల‌లో నేను విడుదల‌ చేయబోతున్నా ఐదో చిత్ర‌మిది. ఏ సినిమాకి థియేటర్ల విషయంలో సమస్య రాలేదు. కానీ ఈ సినిమా విషయంలోనే ఎగ్జిబిటర్స్‌ ఒత్తిడికి గురయ్యారు. నేను ఇండస్ట్రీలో చాలా రోజుగా ఉన్నాను. నాకూ కొంత మంది ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ ఉన్నారు. ఆ పరిచయాతో సినిమాని విడుద చేస్తున్నా. విడుదల‌ను ఆపేది లేదు’ అని అన్నారు.

More News

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా

బలమైన కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేశాడు.

లాంఛ‌నంగా ప్రారంభ‌మైన క‌ల్యాణ్ రామ్ కొత్త చిత్రం

నెంబ‌ర్ వ‌న్ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలో తొలిసారి అడుగుపెట్టింది. శ్రీదేవీ మూవీస్ అధినేత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో

చేతులు కలపనున్న విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్‌

ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఓ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం కోసం చేతులు క‌ల‌ప‌బోతున్నారు.

'బిగ్‌బాస్‌3' పై హెకోర్టులో్ పిటిష‌న్‌

రియాలిటీ షో `బిగ్‌బాస్‌3`ను ఆపేయాలంటూ హైకోర్టులో ఓ న్యాయ‌వాది పిటిష‌న్ వేశారు. ఇప్ప‌టికే రెండు సీజ‌న్స్ ముగిశాయి.

త‌మ‌న్నా, ఓంకార్ కాంబినేష‌న్‌లో లాంఛనంగా ప్రారంభమైన 'రాజుగారిగ‌ది 3'

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం `రాజుగారిగ‌ది` ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే.