close
Choose your channels

బాబుకు ఓటేస్తే ఆంధ్ర దేశం నాశనమైపోతుంది!

Monday, March 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాబుకు ఓటేస్తే ఆంధ్ర దేశం నాశనమైపోతుంది!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటేస్తే 'ఆంధ్ర రాష్ట్రం కమ్మ రాష్ట్రం అయిపోతుంది.. ఆంధ్ర దేశం నాశనమైపోతుంది' అని టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ పోసాని మురళీ కృష్ణ చెప్పుకొచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్ర ప్రజలారా.. ఎవడు దొంగో..'దొంగ' అనే చెప్పండి. ఎవడు లుచ్ఛానో  'లుచ్ఛా' అనే చెప్పండి. ఎవడు మంచోడో..‘మంచోడు’ అనే చెప్పండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని కులాలకు, మతాలకు ఒక్క మాట చెబుతున్నాను.

ఏ కులం వాడు కూడా ఇన్ క్లూడింగ్ 'కమ్మ'.. చంద్రబాబు అనే వాడికి ఓటు వేయొద్దు. అతనొక పెద్ద దొంగ.. అబద్ధాల మనిషి.. అవినీతిపరుడు. ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. చంద్రబాబుకు ఎవరైనా ఓటు వేస్తే, అది కమ్మ రాజ్యానికి, కమ్మ కులానికి, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టే. మరొక్కసారి చంద్రబాబుకు మీరు ఓటేసి గెలిపించారంటే, ఆంధ్ర రాష్ట్రం కమ్మ రాష్ట్రం అయిపోతుంది. ఆంధ్ర దేశం నాశనమైపోతుంది’ అని కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు.

చిరు కుటుంబాన్ని తిట్టించి..

"చంద్రబాబు ఏ కులాన్ని తిట్టకుండా వదిలిపెట్టలేదు. చిరంజీవి కుటుంబంలోని ఆడవాళ్లను కూడా చంద్రబాబు తన పార్టీ వాళ్లతో తిట్టించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లే గెలిచిన చంద్రబాబు.. ఈరోజున ఆయన్ని కూడా తిడుతున్నారు.’ఇది మంచి..ఇది చెడు’ అని చెబుతున్న పవన్ కల్యాణ్ ని అమ్మలక్కలతో తిట్టిస్తావా? నిన్ననే ప్రెస్ మీట్‌లో పనవ్ కల్యాణ్ బాధపడుతూ చెప్పాడు.

మొన్నటి దాకా మోదీ కాళ్లు పట్టుకుని, ఆయనకు శాలువా కప్పిన చంద్రబాబు, ఇప్పుడు, అదే మోదీని హీనంగా తిడుతున్నారు. నాడు సోనియా, రాహుల్ గాంధీలను తిట్టిన చంద్రబాబు, ఇప్పుడు వాళ్లను వాటేసుకుంటున్నారు" అరని పోసాని వ్యాఖ్యానించారు. పోసాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, పోసాని ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.