పృథ్వీకి అలీ ఫోన్ చేసి.. పవన్ గురించి ఏం చెప్పారు!?

  • IndiaGlitz, [Wednesday,April 17 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత అలీకి మధ్య చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే.!. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్.. అలీ గురించి మాట్లాడుతూ ఒకింత ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తాను ఆపదలో ఆదుకున్నా.. సీటిస్తానన్నా ఆయన పార్టీలోకి రాలేదంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.

దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అలీ వీడియోలు రిలీజ్ చేశారు. అక్కడితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అసలు అలీ.. పృథ్వీకి ఫోన్ చేసి ఏం చెప్పారు..? అలీ గురించి ఎవరికి ఎక్కువ తెలుసు..? అనే విషయాలు ఈ ఇంటర్వ్యూలో పృథ్వీ నిశితంగా వివరించారు.

ఫోన్‌‌లో ఏం జరిగింది..!?

రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో పవన్ తనపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని అలీ ఆవేదన వ్యక్తం చేశారని పృథ్వీ చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలతో తీవ్రంగా బాధపడ్డ అలీ తన సన్నిహితులందరికీ కాల్ చేసి చాలా బాధపడ్డారని.. తనకు కూడా కాల్ చేసి 'పవన్ కల్యాణ్ గారు ఇలా అనేశారేంటి?' అంటూ ఒకింత కంటతడిపెట్టుకున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు మామూలే అని చెప్పి తాను అలీని ఓదార్చానని అన్నట్లుగా పృథ్వీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

పవన్‌కు తెలియదు.. నాకు తెలుసు!

అలీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. చెన్నైలో మేమంతా కలిసి తిరిగిన వాళ్లం. దూరం నుంచి మెగాస్టార్ చిరంజీవిని.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబును చూసి సంతోషపడిన వాళ్లం. అలీ ఎన్ని కష్టాలు పడ్డాడో.. ఎంతమందికి ఎన్ని రకాలుగా సాయం చేశాడో నాకు తెలుసుకు. కానీ ఈ విషయాలన్నీ పవన్ కల్యాణ్‌కి తెలియదు.

చేసిన మంచిని ఎవరికీ చెప్పుకోని గొప్ప వ్యక్తిత్వం అలీ సొంతం. ఆయనకి మంచి చేయడమేగానీ.. ఎవరికీ మోసం చేయలేదు.. మోసం అనేది ఆయనకు తెలియదు అని పృథ్వీ చెప్పుకొచ్చారు. పృథ్వీ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ముఖ్యంగా.. జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

జాక్స్‌ను చాలా బాధపెట్టా.. వాడు ఇకలేడు: పూరీ

మనం ఎంతో ముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు, పక్షులు చనిపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. పెంపుడు కుక్క అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లప్పటి నుంచి దాన్ని పెంచి పోషించి

నా జీవితంలో మర్చిపోలేని హిట్ 'మజిలీ'..ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: నాగ చైతన్య

నాగ చైతన్య సమంత జంటగా నటించిన సినిమా 'మజిలీ'.. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్.  

'చిత్ర‌ల‌హ‌రి' కి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభినంద‌న‌లు

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌

రోడ్డు ప్రమాదంలో తెలుగు ఆర్టిస్ట్‌ల దుర్మరణం

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్‌కు వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు టీవీ ఆర్టిస్ట్‌లు మరణించగా..

జూన్‌లో రానా, సాయిప‌ల్ల‌వి 'విరాట ప‌ర్వం'

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను చేయ‌డంలో ముందుండే న‌టుడే రానా ద‌గ్గుబాటి. తెలుగు, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం రానా, సాయిప‌ల్ల‌వి క‌లిసి వేణు ఊడుగుల