close
Choose your channels

కోడెల మరణంతో జగన్ అండ్ కో ఏం సాధించారు? : దేవినేని

Monday, September 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోడెల మరణంతో జగన్ అండ్ కో ఏం సాధించారు? : దేవినేని

మాజీ మంత్రి, నవ్యాంధ్ర తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు నీచ రాజకీయాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు.

కోడెల బాంబులకు కూడా భయపడలేదని... కానీ వైసీపీ నీచ రాజకీయాలే ఆయన పొట్టన పెట్టుకున్నాయన్నారు. తప్పుడు కేసులతో కలత చెందిన కోడెల... ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కోడెలను వేధిస్తూ నిత్యం విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లు కూడా ఆయన మరణానికి ఒక కారణం అని పేర్కొన్నారు. కోడెల మరణంతో జగన్ సర్కార్ ఏం సాధించిందో తెలియడం లేదన్నారు.

వైఎస్ మరణం తర్వాత సీఎం అధికారిక నివాసంలో జగన్ ఫ్యామిలీ కుటుంబం అనధికారికంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. సీఎం నివాసంలో తొమ్మిది నెలల పాటు నిబంధనలకు వ్యతిరేకంగా నివాసమున్నట్లు గుర్తు చేశారు దేవినేని.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.