మ‌హేష్ 25.. షూటింగ్‌లో ఎవ‌రుంటారంటే..

  • IndiaGlitz, [Monday,June 18 2018]

భ‌ర‌త్ అనే నేనుతో భారీ విజ‌యాన్ని అందుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. స్వ‌ల్ప విరామం త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రానికి సిద్ధ‌మ‌య్యారు. క‌థానాయ‌కుడిగా త‌న 25వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా కోసం మ‌హేష్‌.. డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం నుంచి డెహ్ర‌డూన్‌లో ప్రారంభం కానుంది. కాలేజ్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్రకారం.. ఈ షూటింగ్‌లో మ‌హేష్ బాబుతో పాటు క‌థానాయిక పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ కూడా పాల్గొనున్నార‌ని తెలిసింది. ఈ సీన్స్ సినిమాలో కీల‌కంగా ఉంటాయ‌ని స‌మాచారం. ఇందులో అల్ల‌రి న‌రేష్.. మ‌హేష్ స్నేహితుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

More News

'య‌న్‌.టి.ఆర్' విడుద‌ల తేదికి ఓ సెంటిమెంట్‌

మ‌హాన‌టుడు, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా 'య‌న్‌.టి. ఆర్' పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

'స‌వ్య‌సాచి' రీమిక్స్ షూటింగ్ ఎప్పుడంటే..

'నిన్ను రోడ్డు మీద చూసినాది ల‌గ్గాయ‌త్తుస‌.. 'అల్ల‌రి అల్లుడు' (1993) చిత్రం కోసం నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌పై చిత్రీక‌రించిన ఈ పాట ఎంత సంచ‌ల‌న‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

త్రివిక్ర‌మ్‌..16 ఏళ్ళ త‌రువాత‌

ర‌చ‌యిత‌గా కెరీర్‌ను ఆరంభించిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. 'నువ్వే నువ్వే'తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసారు.

ఏడాదికో మెగా హీరోతో బాల‌య్య‌

గ‌త మూడేళ్ళుగా సంక్రాంతి సీజ‌న్‌లో త‌న సినిమాల‌తో సంద‌డి చేస్తున్నారు 'సంక్రాంతి క‌థానాయ‌కుడు'గా పేరు తెచ్చుకున్న‌ న‌ట సింహ బాల‌కృష్ణ‌.

జూన్ 21న యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా వారి 'హ్యాపి వెడ్డింగ్' ఇన్విటేష‌న్‌

వ‌రుడు..  ల‌వ‌ర్స్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌