వర్మని పిచ్చోడిని చేసిందెవరు?
Send us your feedback to audioarticles@vaarta.com
స్వతహాగా నేను పిచ్చోడిని కాదు. కానీ నన్ను ఇద్దరు పిచ్చోడిని చేశారు. వారిద్దరూ చేసిన సినిమా చూశాక నేను ఇలా ప్రవర్తిస్తున్నా అని అంటున్నారు రామ్గోపాల్ వర్మ. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరూ అని ఆరా తీస్తే చార్మి, పూరి అని తేలింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన, ఛార్మి కలిసి నిర్మించిన సినిమా `ఇస్మార్ట్ శంకర్`. ఈ సినిమా గురువారం విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు తెచ్చుకుంటోంది. టిక్కెట్లు కొని సినిమా చూసిన అందరికీ పూరి జగన్నాథ్ థాంక్స్ కూడా చెప్పారు.
ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇటీవల టీమ్ అందరూ కలిసి చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్స్ లో షాంపెయిన్ని వర్మ బాగా కుదిపి చార్మి మీద పోశారు. తర్వాత తన తలమీద పోసుకున్నారు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. నభా నటేష్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడారు. ఆంధ్రలోనూ తెలంగాణ యాసకు చాలా మంచి స్పందన వస్తోందని పూరి జగన్నాథ్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.