లావణ్య కోరిక తీర్చేదెవ్వరో..

  • IndiaGlitz, [Wednesday,July 12 2017]

'అందాల రాక్షసి'తో హీరోయిన్‌గా పరిచయమైన లావణ్య త్రిపాఠికి నటిగా మంచి పేరు వచ్చింది. అయితే అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. రెండు మూడు సినిమాలు చేసినా అవి ఆమె కెరీర్‌కి ఉపయోగపడలేదు. ఆ తర్వాత నానితో చేసిన 'భలే భలే మగాడివోయ్‌', నాగార్జునతో చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాలతో లావణ్యకు హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ వచ్చింది. దానికితోడు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. వరసగా నాలుగు సినిమాలు చేసేసింది. అయితే ఆ నాలుగూ పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం నాగచైతన్యతో 'యుద్ధం శరణం', సందీప్‌ కిషన్‌తో తమిళ్‌లో 'మయవన్‌' చిత్రాలు చేస్తోంది.
ఈ రెండు సినిమాలపై లావణ్య బోలెడు ఆశలు పెట్టుకుంది. ఎప్పుడూ తనని హోమ్లీగానే చూపిస్తున్నారని, దానివల్ల తన గ్లామర్‌కి దక్కాల్సిన క్రెడిట్‌ దక్కడం లేదని వాపోతోంద లావణ్య. 2006 మిస్‌ ఉత్తరఖాండ్‌ టైటిల్‌ని గెలుచుకున్న ఈ సుందరి తనకు మోడ్రన్‌ డ్రస్సులంటేనే చాలా ఇష్టమని చెప్తోంది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో తనకి ఎంతో ఇష్టమైన మోడ్రన్‌ డ్రస్సులు వేసుకునే అవకాశం రాలేదని వాపోతోంది. తన అందాలు ఎక్స్‌పోజ్‌ అయ్యే డ్రస్సులు వేసుకోవాలని, తన గ్లామర్‌ని అందరూ పొగడాలన్న కోరిక తనకూ వుందని ఓపెన్‌గా చెబుతోంది లావణ్య త్రిపాఠి.

More News

బోయపాటి స్టైల్ మారిందా..

యాక్షన్ సినిమాలు చేయడంలో దిట్ట బోయపాటి శ్రీను.

జులై 21న విడుదలకానున్న 'మాయా మాల్'

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 14న విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు చిత్రాన్ని ఒకవారం పోస్ట్ పోన్ చేసి జులై 21న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

ఆ పది మంది డ్రగ్స్ మత్తును వీడి బయటకు రావాలని కోరుకుంటున్నాం : నిర్మాత అల్లు అరవింద్

'టాలీవుడ్ ఇండస్ర్టీలో కొంత మంది యంగ్ స్టార్స్ డ్రగ్స్ మత్తులో తేలుతున్నట్లు తెలిసింది.

మలయాళ రంగంలోకి శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్

ఏమైంది ఈవేళ,అధినేత,బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్

'వాసుకి' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ టీవీ ఛానెల్

స్టార్ హీరోయిన్ నయనతార నటించిన చిత్రం 'వాసుకి'.