‘జబర్దస్త్‌ షో’కు రోజా గుడ్ బై.. జడ్జ్‌గా ఎవరొస్తారో!?

  • IndiaGlitz, [Wednesday,July 17 2019]

‘జబర్దస్త్’ కతర్నాక్ కామెడీ షోకు నగరి ఎమ్మెల్యే రోజా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే సదరు యాజమాన్యానికి ఈ విషయం చెప్పగా.. ఓకే అని మరో పర్మినెంట్ జడ్జ్‌కోసం వెతికే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అసలు రోజా ఎందుకు ఈ షోను వదిలేయాలని అనుకున్నారు..? సడన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

‘రోజా అనే నేను...’ అదృష్టం లేకపోయినా!

చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా రెండోసారి గెలిచి నిలిచిన ఎమ్మెల్యే రోజా.. అటు రాజకీయాలు.. ఇటు కామెడీ షో రెండూ చేస్తూ కాలం గడిపేస్తూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రోజాకు మరిన్ని బాధ్యతలు పెరిగాయి. పైగా మంత్రి పదవి కూడా దక్కుతుందని జగన్ కేబినెట్‌లో ఈమె కూడా ‘రోజా అనే నేను...’ అని గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేస్తారని వీరాభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు అందరూ భావించారు. ఆ అదృష్టం లేకపోయినప్పటికీ.. ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ) చైర్‌పర్సన్‌గా మాత్రం ఇటీవలే బాధ్యతలు కూడా స్వీకరించారు.

బాధ్యతలు పెరిగాయ్.. ఇక గుడ్ బై!

ఇప్పుడు అటు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు.. ఇటు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు రోజాకు ఎక్కువయ్యాయి. దీంతో ఇక రోజాకు టైమ్ అస్సలుండదు. పైగా ఫస్ట్ టైమ్‌ నామినెటెడ్ పోస్ట్.. అందులో చాలెంజింగ్ పదవి కూడా. దీంతో ఈ టెన్షన్‌లే ఎక్కువ ఉంటాయ్ గనుక ఇక కతర్నాక్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేయాలని భావిస్తున్నారట. అంతేకాదు.. కామెడీ షోలను పక్కనెట్టి కాన్‌సన్ట్రేషన్‌ మొత్తం పదవిపైనే పెట్టాలని రోజా ఫిక్స్ అయ్యారట.

రోజా స్థానంలో ఎవరు..!?

రోజా ఈ షోకు గుడ్ బై చెప్పేస్తే ఈమె స్థానంలో ఎవరుంటారు..? ఎవర్ని తీసుకుంటారా..? ఈ షోకు ఎవరైతే న్యాయం చేయగలరా..? అని సదరు యాజమాన్యం సెర్చింగ్‌లో ఉందట. ముఖ్యంగా ఇప్పటికే ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన మీనా, సంఘవి ఇప్పటికే ఓ సారి షోకు ఫెర్ఫామెన్స్ చూపించి వెళ్లారు. వీరిద్దరిలోనే ఎవరో ఒకర్ని ఫైనల్‌ చేసి అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువరించనున్నారని సమాచారం. కాగా సంఘవి అయితే బెటర్‌గా ఉంటుందని యాజమాన్యం భావిస్తున్నట్లు టాక్. రోజా ఏ ఎపిసోడ్‌తో గుడ్ బై చెప్పేస్తారో..? ఫైనల్‌గా ఎవర్ని లేడీ జడ్జ్‌గా తీసుకుంటారో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

More News

నా సినీ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌ ‘మిస్టర్ కేకే’!

టాలీవుడ్‌లో ‘శివ‌పుత్రుడు’, ‘అప‌రిచితుడు’ చిత్రాల‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో విక్ర‌మ్.

'రణరంగం' ఆగస్టు 15 న విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో

'ఎవ‌రు' ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌

`క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`.

విక్రమ్ టాలెంటెడ్ యాక్టర్.. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్! - అక్ష‌ర‌హాస‌న్

క‌మ‌ల్‌హాస‌న్, సారిక‌ల రెండ‌వ కుమార్తె అక్ష‌ర‌హాస‌న్ నటిస్తున్న రెండో చిత్రం ‘మిస్ట‌ర్ కేకే’. ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌,

ఏపీకి కొత్త గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌.. నరసింహన్ సంగతేంటి!?

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ నియమితులయ్యారు. హరించందన్ ఏపీ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.