ఆ ట్వీట్‌ని బ్రహ్మాజీ ఎందుకు డిలీట్ చేశారు?

  • IndiaGlitz, [Monday,October 19 2020]

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. అభిమానుల ప్రశ్నలకు ఫన్నీ ఫన్నీగా సమాధానాలు ఇస్తూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు. తోటి నటీనటులు ఏమైనా పోస్టులు పెట్టినా సరే చాలా సరదాగా స్పందిస్తారు. చాలా సీరియస్ విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పి అభిమానుల్లో మరోమారు మంచి జోష్ నింపారు. అసలు విషయంలోకి వెళితే తాజాగా నగరంలో కురుస్తున్న బీభత్సమైన వర్షాలకు ఆయన ఇంట్లోకి కూడా నీళ్లొచ్చాయి. నిజానికి అది చాలా సీరియస్ విషయం కానీ బ్రహ్మాజీ దానిని కూడా కామెడీ చేసేశారు.

తన ఇంట్లోకి నీళ్లు వచ్చిన పిక్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన బ్రహ్మాజీ.. ‘మోటార్ బోటు కొనాలనుకుంటున్నా.. ఏది కొనాలో సలహా ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు ఆగుతారా? ఓ రేంజ్‌లో ఆయన ట్వీట్‌కు స్పందన వచ్చింది. నెటిజన్లు సైతం చాలా ఫన్నీగా స్పందించారు. కానీ ఆ ట్వీట్‌ను బ్రహ్మాజీ ఎందుకో గాని డిలీట్ చేశారు. కారణమేంటో తెలియట్లేదు. కాగా.. ప్రస్తుతం బ్రహ్మాజీ.. ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ షూటింగ్ సందర్భంగా బ్రహ్మాజీ, సోనూసూద్ తీసుకున్న ఫన్నీ పిక్స్ ఇరువురి అభిమానులనూ ఆకట్టుకుంటున్నాయి.

More News

ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ ప్రారంభించిన శశి ప్రీతమ్‌, ఐశ్వర్య కృష్ణప్రియ

గాయనీ గాయకులను, బ్యాండ్స్‌ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌ సోమవారం నాడు ‘డెక్కన్‌ మ్యూజిక్‌ ఛాలెంజ్‌’ కాంపిటీషన్‌ ప్రారంభించారు.

నందమూరి బాలకృష్ణ 'నర్తనశాల' ఈ నెల 24న విడుదల

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా

ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్..

కరోనా వైరస్ కట్టడి కోసం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన చివరి దశ ప్రయోగాలను భారీ స్థాయిలో చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

'క‌ల‌ర్ ఫొటో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా

టీడీపీ కమిటీలను ప్రకటించిన చంద్రబాబు.. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్న..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ కమిటీలను ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ప్రకటించిన చంద్రబాబు..