నాగార్జున మామను కాస్తా... జస్ట్ నాగార్జునగా మార్చిన సమంత, ఆ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏమిటీ..?

  • IndiaGlitz, [Tuesday,September 21 2021]

గడిచిన రెండు మూడు నెలలుగా సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితంపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . సోషల్ మీడియా కథనాలపై అటు నాగ చైతన్య కానీ, ఇటు సమంత కానీ ఖండించడం లేదు. వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని అందరికీ తెలిసినా.. అందుకు కారణం ఏమిటో పూర్తిగా తెలియడం లేదు. మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా... స్టేట్మెంట్స్‌తో చెక్ పెట్టే ప్రయత్నం చేయడం లేదు. అదే సమయంలో సమంత సోషల్ మీడియా చేస్తూ వస్తోన్న పోస్ట్స్ అనేక అనుమానాలను రేకెత్తించేవిగా ఉంటున్నాయి.

నిన్న నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి కావడంతో, నాగార్జున తండ్రిని గుర్తుచేసుకుంటూ... ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై స్పందించిన సమంత, నాగార్జున పేరుకు ముందు వెనుక, ఎటువంటి గౌరవ సూచికలు లేకుండా పోస్ట్ చేశారు. కారణం ఏమిటో కానీ, వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసి, నాగార్జున మామ అంటూ మరో ట్వీట్ చేశారు. మొదటి ట్వీట్ లో మామ అనే పదం లేకుండా సమంత ట్వీట్ చేయడం కలకలం రేపింది. ఈ ట్వీట్ సమంత, అక్కినేని కుటుంబం మధ్య నెలకొన్న గ్యాప్‌ను స్పష్టం చేసేదిగా ఉంది.

ఇదిలా ఉంటే సమంత తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన స్టాఫ్‌తో కలిసి శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో భాగంగా సామ్‌ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం ముగించుకొని బయటకు రాగానే అక్కడే ఉన్న మీడియా వారు ఆమెను కదిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.. ‘మీ గురించి రూమర్స్‌ వస్తున్నాయి’ అంటూ ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా సీరియస్‌ అయిన సమంత.. ‘గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి.? అసలు బుద్ధి ఉందా.?’ అంటూ ఘూటుగా స్పందించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా సైలంట్‌ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

More News

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్: రోడ్డు కాంట్రాక్టర్‌పై కన్నెర్ర చేసిన జీహెచ్ఎంసీ, భారీ జరిమానా

హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో టాలీవుడ్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై అప్పట్లో పలువురు సినీ ప్రముఖులు రకరకాల వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు : రవికి లహరికి లింక్ పెట్టిన ప్రియ.. మీకూ పిల్లలున్నారంటూ రవి ఫైర్

ఎలిమినేషన్ ముగియడంతో సోమవారం రావడంతో నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించాడు బిగ్‌బాస్. ఇంటిలోని ప్రతి కంటెస్టెంట్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని..

పోర్నోగ్రఫీ కేసు: రాజ్‌‌కుంద్రాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్ట్

అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో అరెస్టయిన వ్యాపార వేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరైంది. రూ.50 వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు ఆయనకు సోమవారం

తండ్రి బాటలో షర్మిల.. అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి మరో ‘ప్రజా ప్రస్థానం’

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆ మేరకు గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు.

ప్రభాస్ విడుదల చేసిన ‘ఆకాశవాణి’ ట్రైలర్... సోనీ లివ్‌లో సెప్టెంబ‌ర్ 24న సినిమా రిలీజ్‌

విల‌క్ష‌ణ న‌టుడు సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై