బన్ని , బోయపాటిల ప్రయత్నం ఫలించేనా..?

  • IndiaGlitz, [Friday,October 09 2015]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం స‌రైనోడు. ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న సరైనోడు చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి స‌రైనోడు టైటిల్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది.

అయితే బ‌న్ని ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో... ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న బ‌ర్త్ డే ప్రెస్ మీట్ లో...స‌రైనోడు టైటిల్ క‌రెక్టే అంటూ క‌న్ ఫ‌ర్మ్ చేసారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..బోయ‌పాటి ఈ సినిమాతో త‌న స్టైల్ మార్చి మాస్ ఆడియోన్స్ తో పాటు క్లాస్ ఆడియోన్స్ ను కూడా ఆక‌ట్టుకునేలా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడట‌. అందుక‌నే క్లాస్ ఆడియోన్స్ కి చేరువ‌య్యేలా స‌రైనోడు అనే టైటిల్ పెట్టాడ‌ట‌.మ‌రి..బ‌న్ని, బోయ‌పాటిల ప్ర‌య‌త్నం ఫ‌లించేనా..? స‌రైనోడుకి స‌క్సెస్ అయ్యేనా..? తెలుసుకోవాలంటే ఏప్రిల్ వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

బాలకృష్ణ చేతులమీదుగా 'సతీ తిమ్మమాంబ' ఆడియో విడుదల

శ్రీ వెంకట్,భవ్య శ్రీ ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న చిత్రం సతీ తిమ్మమాంబ.

చరణ్ కి విలన్ ఇతనే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా తర్వాత తమిళ్ సినిమా తని ఒరువన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

4 ఏళ్ల తరువాత విక్రమ్ డబుల్ ధమాకా

సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ..తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న తమిళ కథానాయకుడు విక్రమ్.తెలుగులోనూ తనకంటూ ఓ మార్కెట్ ని సొంతం చేసుకున్న విక్రమ్ ఈ ఏడాది ఆరంభంలో 'ఐ'సినిమాతో పలకరించాడు.

కళ్యాణ్ రామ్ హీరోయిజానికి 12 ఏళ్లు..

2015..పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు చిరునామాగా నిలుస్తోంది.అయితే ఈ సంవత్సరంలో ఈ బ్లాక్ బస్టర్ అనే పదానికి శ్రీకారం చుట్టిన సినిమా మాత్రం 'పటాస్'.

మొన్న మహేష్..నిన్న ఎన్టీఆర్..నేడు చరణ్..

యాక్షన్ కి కామెడీని మిక్స్ చేయడంలో శ్రీనువైట్లది అందెవేసిన చెయ్యి.అందుకే తన కెరీర్ లో విజయాల శాతం ఎక్కువ. గతేడాది 'ఆగడు'తో పరాజయం ఎదురైనప్పటికీ..