త‌మ‌న్‌కు ఈ సారి కూడా ప్ల‌స్ అవుతుందా?

  • IndiaGlitz, [Sunday,July 01 2018]

బృందావ‌నం, దూకుడు, మ‌హానుభావుడు.. యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ సంగీత‌మందించిన ఈ మూడు చిత్రాల‌కూ ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే.. ఈ చిత్రాల‌న్నీ ద‌స‌రా సీజ‌న్‌లోనే విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి. అలాగే కెరీర్‌కు కీల‌క‌మైన స‌మ‌యంలో త‌మ‌న్‌కు విజ‌యాన్ని అందించాయి. ఇప్పుడు ఇదే ద‌స‌రా సీజ‌న్‌లో మ‌రో రెండు సినిమాల‌తో త‌మ‌న్ సంద‌డి చేయ‌నున్నారు. ఆ సినిమాలే.. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని.

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ.. విజ‌య ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుండ‌గా.. శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని కూడా ద‌స‌రా సీజ‌న్‌ను టార్గెట్ చేసుకుని రాబోతోంది. ఈ రెండు సినిమాల‌కు త‌మ‌న్ అందిస్తున్న సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ద‌స‌రా సీజ‌న్‌లో వ‌చ్చిన త‌మ‌న్ చిత్రాలు సింహ భాగం విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఈ సినిమాలు కూడా ఆ దిశ‌గా వెళ‌తాయేమో చూడాలి.

More News

ఫ్యామిలీ స‌బ్జెక్ట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఇప్ప‌టివ‌ర‌కు యువ‌త‌నే టార్గెట్ చేసుకున్న సినిమాల్లో.. క‌థానాయ‌కుడిగా న‌టించారు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌,

'సాక్ష్యం' మ‌ళ్ళీ వాయిదా?

అల్లుడు శీనుతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌.. ఆ త‌రువాత స్పీడున్నోడు, జ‌య‌జానకి నాయ‌క చిత్రాల్లో న‌టించారు.

'పంతం' ప్రీ రిలీజ్ వేడుక‌

గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.

'సుబ్రహ్మణ్యపురం' ఫస్ట్ లుక్ విడుదల

ఇటీవల 'మళ్ళీ రావా' వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'.

ఈసారి ర‌వితేజ‌తో..

'కలుసుకోవాలని' సినిమాతో రైటర్‌గా తొలి అడుగులు వేశారు వక్కంతం వంశీ.